జనం న్యూస్: తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డిల పేర్లను ప్రకటించింది. ఈ రెండు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల గడువు గురువారం ముగియనుండగా… దీంతో వారు ఈరోజే నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. అయితే వీరిలో వేం నరేందర్ రెడ్డి… సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులలో ఒకరిగా ఉన్నారు. చాలా మంది నేతలు పోటీలో ఉన్నప్పటికీ… వేం నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిచండం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. వివరాలు. పశ్చిమ బెంగాల్తో సహా పలు రాష్ట్రాల్లోని త్వరలో పదవీకాలం ముగియనున్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కేఆర్ సురేశ్రెడ్డి(బీఆర్ఎస్), అభిషేక్ మను సింఘ్వీ(కాంగ్రెస్) రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. ఆ రెండు స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలాల దృష్ట్యా ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అచువకాశం కల్పించింది. అయితే ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని మళ్లీ తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అయితే రెండు స్థానాలు తెలంగాణకు చెందినవారికే కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని పార్టీ నాయకులు కోరారు. అయితే పలు సమీకరణాల దృష్ట్యా అభిషేక్ మను సింఘ్వీని తిరిగి తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపనున్నట్టుగా స్పష్టం చేసింది. మరో స్థానంకు సంబంధించి అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం విస్తృత చర్చలు జరిపింది. దాదాపు 16 మంది నేతలు రేసులో నిలిచినట్టుగా తెలిసింది. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వినయ్కుమార్, జెట్టి కుసుమకుమార్ తదితరుల పేర్లు కూడా ఆశావహుల జాబితాలో వినిపించాయి. చివరగా వేం నరేందర్రెడ్డి, వంశీచంద్రెడ్డి, దమ్మాటి సాంబయ్య పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో విస్తృత సంప్రదింపుల అనంతరం వేం నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నారు. వేం నరేందర్రెడ్డి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో 1960 డిసెంబరు 26న జన్మించారు. ఆయనకు భార్య విజయ లక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 2010 ఉప ఎన్నికలో వరంగల్ వెస్ట్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2017 అక్టోబర్ 28న టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం రేవంత్ రెడ్డితో పాటే ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. 2024 జనవరి 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో ఇరువురి మధ్య స్నేహా బంధం బలపడింది. ఇక, తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిల ఎంపిక లాంఛనప్రాయంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇతర అభ్యర్థులు కూడా బరిలో నిలిస్తే. ఈ నెల 16న పోలింగ్ నిర్వహించనున్నారు.