సాక్షి డిజిటల్ న్యూస్ : ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుంది. మరోవైపు పలు దేశాలు తమ గగనతలాలు మూసివేయడంతో విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పలువురు భారతీయులు ఆయా దేశాల్లో చిక్కుకుపోయారు. అయితే అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ చేసిన దాడిలో పలువురు గాయపడ్డారు. అందులో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు. ఈ మేరకు తెలంగాణలోని అతడి తల్లిదండ్రులు వివరాలు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లెకు గ్రామానికి చెందిన ఎన్ రాజేశ్వరరావు అబుదాబి విమానాశ్రయంలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. అతడి తల్లిదండ్రులు తెలంగాణలోనే ఉంటున్నారు. అయితే ఇటీవల అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇరాన్ జరిపిన దాడిలో తాను గాయపడినట్టుగా రాజేశ్వరరావు తెలంగాణలోని తన తల్లిదండ్రులకు తెలియజేశారు. అలాగే తనతో పాటు అనేక మందికి స్వల్ప గాయాలు అయినట్టుగా కూడా చెప్పారు. ఈ మేరకు రాజశ్వేరరావు తండ్రి ప్రభాకర్ రావు వివరాలు వెల్లడించారు. ‘‘నా కొడుకు ఒక సంవత్సరంగా అక్కడ పనిచేస్తున్నారు. అతను విమానాశ్రయంలో పనిచేస్తున్నారు. దాడిలో అతనికి గాయాలు అయ్యాయి. అతను వీడియో కాల్ ద్వారా మాతో మాట్లాడాడు… కానీ అతను మాకు గాయాలను చూపించడం లేదు. నా కొడుకు త్వరగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను’’ అని ప్రభాకర్ రావు పిటిఐ వీడియోస్తో తెలిపారు. తమ కొడుకు సురక్షితంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని రాజేశ్వరరావు తల్లిదండ్రులు కోరారు. గల్ఫ్ నుంచి కొందరు భారతీయులు విమానాల్లో భారత్కు చేరుకుంటున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల బృందం.