జనం న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇరువురు తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు భేటీ అయ్యారు. మధ్యాహ్నాం 11:30 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అయితే ఈ మీటింగ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఇద్దరు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు భర్తీకాని నామినేటెడ్ పోస్టులపై సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. నెల రోజుల వ్యవధిలోనే మరోసారి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశాలపైనే చర్చ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్కు సీఎం చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11:30 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన కల్తీ పాలు, అతిసారం వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం పేలుడు. 22 మంది మృతి వంటి అంశాలపై కూడా వాడివేడిగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివాదంపైనా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడుల మధ్య చర్చ జరగనుంది.వీటితోపాటు టీటీడీ లడ్డు అంశం, వన్ మెన్ కమిటీ, కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై చర్చ. మరోవైపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు. నీటిపారుదలశాఖ పరిధిలోని డ్రైనేజీలో పూడిక తీత అంశాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను ముఖ్యమంత్రి తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోపై పలు అంశాలపై మాట్లాడుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం జరుగుతోంది. లడ్డూ కల్తీ, బీఆర్ నాయుడు వ్యవహారంపై చర్చ. రాష్ట్రంలో తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది.వైసీపీ మాత్రం కల్తీ జరగలేదు అని చెప్తోంది. మరోవైపు అసలు శ్రీవారి లడ్డూలో నెయ్యే వాడలేదని కెమికల్స్ వాడారని సిట్ నివేదిక ఇచ్చింది అని టీడీపీ చెప్తోంది. ఇలా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టీటీడీ తిరుమల తిరుపతి లడ్డూ అంశానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ ఒక్కటే ఇప్పటి వరకు ప్రత్యక్ష ఆందోళనలో ఉంది.. దీంతోపాటు కూటమి మొత్తం కలిసి వస్తే గనుక తీవ్రత కొంచెం పెంచినట్టు అర్థమవుతుంది. మరోవైపు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలపై అటు వైసీపీ ఇటు కూటమి నేతల మధ్య ఒక మినీవార్ నడుస్తోంది. టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి తొలగించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీంతో ఈ అంశంపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.