రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్-ఆర్థిక సాయం ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాల విక్రయం కలకలం రేపింది. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ పాల విక్రయం కలకలం రేపింది. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన నలుగురు వ్యక్తులు మరణించారు. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… రాజమహేంద్రవరంలో పలువురు అస్వస్థతకు గురికావడం, మరణాలు చోటుచేసుకోవడం బాధ కలిగించిందని చెప్పారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని వరలక్ష్మీ డెయిరీ… 106 మందికి పాలను సరఫరా చేసిందని, ఈ పాల వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమిక నిర్దారణ అయిందని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు చనిపోయారని చెప్పారు. మరో 8 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని… ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు. మృతురాలు కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 194 కింద బాధ్యులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనకు సంబంధించి డెయిరీ నిర్వహిస్తున్న ప్రధాన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. పాలు కలుషితం చేసినట్టుగా నిర్దారణ అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోందని వెల్లడించారు. నమూనాలు సేకరించి ల్యాబ్‍లకు పంపారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి కోలుకునేవరకు వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అసలేం జరిగిందంటే… రాజమహేంద్రవరంలోని అనధికార విక్రేత సరఫరా చేసిన కల్తీ పాలు సేవించి గత రెండు రోజుల్లో నలుగురు మరణించారని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) వై శ్రీకాంత్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఆదివారం ఇద్దరు మరణించగా, సోమవారం మరో ఇద్దరు మృతిచెందారు. కలుషితమైన పాలు కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణమయ్యాయని… దీంతో అకస్మాత్తుగా మూత్ర విసర్జన నిలిచిపోవడం మరణానికి దారితీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఇళ్లకు పంపిణీ చేయడానికి ముందు పాలను అమ్మిన వ్యక్తి దాదాపు 40 పశువులు, స్థానిక రైతుల నుండి పాలను సేకరించారని చెప్పారు. అదే వ్యక్తి నుంచి పాలు కొనుగోలు చేసిన మరికొందరు అస్వస్థతకు గురై ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి పరీక్ష కోసం వివిధ ప్రయోగశాలలకు పంపారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సీమక్షించేందుకు అయితే అనేక బృందాలు రంగంలోకి దించారు. మరోవైపు రాజమహేంద్రవరంలో కల్తీ పాలకు సంబంధించిన మరణాలు నమోదైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాలలో వైద్య సహాయం, ఏర్పాట్ల గురించి జిల్లా అధికారులు ఆయనకు వివరించారని అధికారిక ప్రకటనలో తెలిపింది. ‘‘రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్‌, స్వరూప్ నగర్‌లో కల్తీ పాలు తాగి స్థానికులు అస్వస్థతకు గురికావడం, మరణాలపై చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. పాలు వినియోగించిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని, పరీక్ష లకు పంపామని అధికారులు తెలిపారు. ఫలితాలు వచ్చిన అనంతరం పాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు’’ అని సీఎంవో ఒక ప్రకనటలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *