మైక్రో ఇరిగేషన్ నిధుల విడుదలపై కేంద్రాన్ని కలిసిన అచ్చెన్నాయుడు

జనం న్యూస్: కేంద్ర వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మైక్రో ఇరిగేషన్ నిధులు విడుదల చేయండి. రూ.400 కోట్లు సెంట్రల్ షేర్ నిధులు విడుదల చేయాలని కోరారు. కేంద్ర వ్యవసాయం & రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం తిరుమలను సందర్శించారు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలు ముఖ్యాంశాలపై చర్చించారు.రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమ కార్యక్రమాల అమలు, కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై ఇరు మంత్రులు విస్తృతంగా అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, నిధులు మరియు వివిధ పథకాల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మైక్రో ఇరిగేషన్ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయండి. రైతుల ఆదాయవృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు మంత్రులు ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న మైక్రో ఇరిగేషన్ పథకానికి సంబంధించిన కేంద్ర వాటా నిధుల విడుదల అంశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేసిన పథకాల కింద కేంద్ర వాటాగా మొత్తం రూ.695 కోట్లు రావలసి ఉందని తెలిపారు. ఈ నెలలో కేవలం రూ.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, ఇంకా రూ.645 కోట్లు విడుదల చేయాల్సి ఉందని వివరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన కేంద్ర వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. రూ.400 కోట్లు సెంట్రల్ షేర్ నిధులు విడుదల చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *