జనం న్యూస్: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,మాజీ సీఎం జగన్లపై రెచ్చిపోయారు. ఇద్దరు నేతలు ప్రధాని నరేంద్రమోడీకి ప్రచార కర్తలుగా, బీజేపీకి బానిసలుగా మారారని ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే తోలుబొమ్మలని మండిపడ్డారు. చంద్రబాబుది బీజేపీతో అధికారిక పొత్తు అయితే జగన్ది అక్రమ పొత్తు అంటూ షర్మిల ట్వీట్ చేశారు. AI సదస్సు వేదికగా చైనా కుక్క బొమ్మతో దేశ పరువును నరేంద్రమోడీ తీస్తే పెకలని చంద్రబాబు, దత్తపుత్రుడు జగన్ నోర్లు శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ పై పేలడం హాస్యాస్పదం అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ నిరసనలు సిగ్గుచేటని మాట్లాడటం ఇంకా దారుణం అని అన్నారు. అస్తవ్యస్థ సమ్మిట్తో 70 దేశాల ముందు దేశ ప్రతిష్ట దిగజారితే సిగ్గుపడేలా అనిపించలేదా? అప్పుడు కలగలేదా ఆవేదన? భారతీయ ప్రతిభను తొక్కిపెట్టి. చైనా ఉత్పత్తులు ప్రదర్శిస్తే జరగలేదా దేశానికి అవమానం? ప్రపంచం ముంగిట కాలేదా మనం నవ్వులపాలు ? అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. బీజేపీ కూటమితో జగన్ది అక్రమ పొత్తు. ‘బాధ్యతా రాహిత్యం గురించి చంద్రబాబు నాయుడు రాజకీయాల ఐక్యత గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు పలికినట్లే ఉంది అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. విభేదాలపై దశ- దిశలు మీరు చెప్పడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్. దేశంకోసం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షాన్ని దగ్గరుండి కరెక్ట్ చేయడం టీడీపీకి వైసీపీకి ఇది నిజంగా సిగ్గుచేటు అని షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కల్యాణ్ అంటూ కొత్త నిర్వచనం చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీజీ కోసం పని చేసే మౌత్ పీస్లు. బీజేపీ ఎదుట బానిసలు. స్వప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే తోలుబొమ్మలు. చంద్రబాబుది అధికారిక పొత్తు. అదే బీజేపీ కూటమితో జగన్ది అక్రమ పొత్తు. ప్రధాని మోడీ కాషాయ కామెర్లు సోకినోళ్లు ఇలా కాకుండా ఎలా మాట్లాడుతారు లే అనివైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ట్రంప్ ఎదుట సాగిలపడ్డప్పుడే దేశం పరువుపోయింది. ‘దేశ రైతులను ఫణంగా పెట్టి ట్రంప్ ఎదుట సాగిలపడ్డప్పుడే పోయింది దేశ పరువు. అమెరికా ప్రయోజనం కోసం సున్నా సుంకాలకు ఒప్పుకున్నప్పుడే దిగజారింది దేశ ప్రతిష్ట’అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.‘అగ్రరాజ్యంతో జరిగింది బ్లాక్ డీల్ అని, భారత రైతులకు ఇది మరణశాసనమని, దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదమని చెప్పే ప్రయత్నమే IYC చేసిన నిరసన ప్రదర్శన. చంద్రబాబు, జగన్కి ఇది అర్థం కాకపోవడం అది వారి అవివేకం. ప్రజల నుంచి కాంగ్రెస్ కు మద్దతు పెరుగుతుంటే చూసి ఓర్వలేక ఉగ్రకోణం అని బీజేపీ వాదించడం అత్యంత దారుణం. ఇది కేంద్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనం’ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.