మ్యాచ్ టికెట్లపై రాజకీయ రగడ

8 జగన్‌పై లోకేష్ సూటి ప్రశ్న!

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, మరికొందరు టీడీపీ నేతలు కూడా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు కొలంబోకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందించారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు భారత్‌లో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, మరికొందరు టీడీపీ నేతలు కూడా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు కొలంబోకు వెళ్లారు. అయితే మంత్రి లోకేష్ కొలంబో పర్యటన, మ్యాచ్‌కు హాజరవ్వడంపై వైసీపీ, కొన్ని మీడియా ఛానల్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. లోకేష్. జనం సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉంటే. లోకేష్ క్రికెట్ మ్యాచ్‌ చూడటం కోసం కోటి రూపాయలకు పైగానే ఖర్చయిందని ఆరోపణలు చేశారు. ఈ మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తున్నట్టుగా ఆరోపించారు. ఈ ప్రచారం ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా స్పందించింది. కొలంబో‌లో జరిగిన భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్‌కి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ ధనం వెచ్చించి వెళ్లారనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. నారా లోకేష్ కొలంబో పర్యటన కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని స్పష్టతనిచ్చింది. ఇలాంటి అసత్య వార్తలు నమ్మవద్దని ప్రజలను కోరింది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పుష్ప స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. ఫ్లైట్ టికెట్టు తనదేనని, మ్యాచ్ టికెట్ తనదేనని చెప్పారు.‘‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా’’ అని జగన్‌ను లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసిన నారా లోకేష. జగన్‌ను కూడా ట్యాగ్ చేశారు. ఇదిలాఉంటే, కొలంబోలో జరగిని భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు మంత్రి లోకేష్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడంపై మంత్రి లోకేష్ స్పందిస్తూ. టీమిండియా ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఇషాన్‌ కిషాన్ అద్భుతంగా ఆడారని పేర్కొన్నారు. పూర్తి అధిపత్యంతో అద్భుతమైన విజయాన్ని టీమిండియా సొంతం చేసుకుందని పేర్కొన్నారు. టీమిండియాకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *