జనం న్యూస్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉంది అని. సిట్ నోటీసులు ఎవరికైనా ఇవ్వొచ్చు అని. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించింది. ఉద్యమనాయకుడిగా కేసీఆర్ అంటే తమకు చాలా గౌరవం ఉంది అని పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్లో ఎవరు భాగస్వాములో తేలాల్సి ఉంది అని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్పై పారదర్శక విచారణ జరుగుతోంది. సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చు అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గతంలో సీఎం కేసీఆర్,మంత్రుల ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవు అని చెప్పుకొచ్చారు. అధికారులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడరని చెప్పుకొచ్చారు. సిట్ సంపూర్ణ విచారణ జరిగితేనే నిజాలు బయటకు వస్తాయి అని చెప్పుకొచ్చింది.కేసీఆర్కు నోటీసులపై రాజకీయ దురుద్దేశం లేదు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లినట్లు తెలుస్తోంది. రేపు కేసీఆర్ను విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఆరోగ్య రీత్యా జూబ్లీహిల్స్ పీఎస్కు విచారణకు పిలుస్తారా? లేక ఆన్ లైన్లో విచారిస్తారా? లేక ఫామ్హౌస్లోనే విచారిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలుత మాజీమంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారించారు.ఆ తర్వాత కేటీఆర్ను సైతం సిట్ విచారించింది. రీసెంట్గా మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోషరావును సైతం సిట్ విచారించింది. తాజాగా కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెడీ అవ్వడంతో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. కేసీఆర్కు సిట్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జనవరి 30న అనగా శుక్రవారం మధ్యాహ్నాం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది.ఇటీవలే ఇదే కేసులో మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను సిట్ విచారించింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావును కూడా సిట్ విచారించింది. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది.65 ఏళ్ల వయసు కావడంతో ఎక్కడ విచారణకు హాజరుకావాల్సింది అనేది కేసీఆర్ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది అని నోటీసుల్లో పేర్కొంది. 1973 సెక్షన్ 160 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం వయోభారంతో ఉన్నవారు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు అని తెలిపింది. కేసీఆర్కు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడకు వచ్చి సిట్ బృందం విచారిస్తుంది అని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఈ అంశాలపై ఆరా తీసే ఛాన్స్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో అధికారులు, ప్రజాప్రతినిధులకు సిట్ వరుస నోటీసులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ,అధికారులకు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరించడంతో కేసీఆర్ను విచారించి పలు అంశాలపై క్లారిటీ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. ఈమేరకు మాజీ సీఎం కేసీఆర్కు 160 CRPC కింద నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల సమయంలో అధికారంలో ఉన్న కీలక వ్యక్తులకు, ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల గురించి కేసీఆర్ను ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్కు సిట్ బృందం నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.