సింగరేణి వ్యవహారంలో బీఆర్ఎస్ దూకుడు

*గవర్నర్‌ను ఆశ్రయించనున్న పార్టీ

సాక్షి డిజిటల్ న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ కానున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ముఖ్య నేతలు గవర్నర్‌ను కలిసి సింగరేణి కుంభకోణంపై ఫిర్యాదు చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. సింగరేణిలో బొగ్గు టెండర్ల విషయంలో భారీగా కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రెస్‌మీట్లు పెట్టి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. అంతేకాదు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సైతం నేరుగా లేఖ రాశారు. బొగ్గు గనుల కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి హారీశ్ రావు లేఖ రాయడం…విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బీఆర్ఎస్ ఈ విషయంలో తగ్గేదే లే అంటుంది. తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌ను కలవనున్న బీఆర్ఎస్ సింగరేణి కుంభకోణం అంశంపై మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో సమావేశం కానుంది.తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పో యిందని …ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని, ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించు కుంది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు…లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అందజేయనున్నారు.సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి మరియు పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ఇంతటి భారీ స్కామ్‌లో భాగస్వాములైన ముఖ్యమంత్రికి మరియు ఇతర మంత్రులకు పదవిలో కొనసాగేందుకు నైతిక, రాజ్యాంగ పరమైన హక్కు లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్‌కు తెలియజేయనున్నది. మంగళవారం గవర్నర్‌తో భేటీకి పార్టీకి చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఇతర సీనియర్ నాయకులకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *