సాక్షి డిజిటల్ న్యూస్: రిపబ్లిక్ డే రోజున భారత్లో దాడులకు పాకిస్తాన్ కుట్రలు చేస్తోంది. పాక్ ఉగ్ర సంస్థలు, పంజాబ్ గ్యాంగ్స్టర్లు కలిసి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత్లోని దేవాలయాలు, కీలక ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులకు సిద్ధమైనట్లు తెలిపాయి. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన భద్రతా బలగాలు.. ఉగ్ర కుట్రలను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు చేపట్టాయి. భారత గణతంత్ర దినోత్సవం వేళ జనవరి 26వ తేదీన భారీ ఉగ్ర దాడులకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్ర హెచ్చరికలు చేశాయి. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామమందిరం.. జమ్మూ కాశ్మీర్లోని రఘునాథ్ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్ర సంస్థలైన జైషే మహమ్మద్, లష్కరే తోయిబాలు భారీ ఉగ్రకుట్రకు తెరలేపినట్లు పేర్కొన్నాయి. పంజాబ్ గ్యాంగ్స్టర్ల సాయంతో భారత్లో ఈ దాడులకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించి.. వాంటెడ్ ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. పాక్ ఐఎస్ఐ, పంజాబ్ గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాద సంస్థల ఉమ్మడి కుట్రతో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు భారీ విధ్వంసానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు నిఘా వర్గాలు తాజాగా హెచ్చరించాయి. ఈ కుట్రకు ’26-26′ అని కోడ్ నేమ్ పెట్టినట్లు తెలుస్తోంది. పాక్ ఐఎస్ఐ కనుసన్నల్లో జైషే మహమ్మద్, లష్కరే తొయిబా అనుబంధ సంస్థలు, పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్లు కలిసి ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నాయి. పంజాబ్ నేరస్థులను ఫుట్ సోల్జర్స్గా వాడుకోవాలని పాకిస్తాన్ చూస్తోందని తెలిపాయి. అయోధ్యలోని రామ మందిరం.. జమ్మూలోని రఘునాథ్ ఆలయం సహా దేశంలోని మరికొన్ని ప్రముఖ నగరాలు, ఆలయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. గత నవంబర్లో దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడిలో 15 మంది మృతి చెందడం.. అంతకుముందు ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చనిపోవడం వెనుక ఉన్న శక్తులే ఇప్పుడు కూడా క్రియాశీలకంగా ఉన్నాయ.