జిల్లాలు, మండలాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

* జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరణ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరణ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు నచ్చితే నజరానా అనే విధంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజన చేశారని ఆరోపించారు. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించి మార్పులు, చేర్పులు చేయాలని రకరకాల డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. అయితే పొలిటికల్ నిర్ణయాలు తీసుకుంటే న్యాయం జరగదని, సరైన విధంగా విభజన జరగదని అన్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే జిల్లాల పునర్విభజన కోసం రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీలలో రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ఉంటారని చెప్పారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఫాలో అయిన విధంగా తాము ఏర్పాటు చేయబోయే కమిటీ కూడా రాష్ట్రమంతా తిరిగి సమాచారం సేకరించి, అభిప్రాయాలు స్వీకరిస్తుందని తెలిపారు. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను తగ్గించడం, పెంచడం అని తాను చెప్పడం లేదని రేషనలైజ్ చేయాలని అంటున్నామని చెప్పారు. మండలంలో ఎంత జనాభా ఉండాలి?, రెవెన్యూ డివిజన్‌లో ఎంత జనాభా ఉండాలి?, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి? అనేది ఒక ప్రతిపాదికన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక దగ్గర మూడు లక్షల జనాభా ఉండి మరో చోట కోటి జనాభా ఉంటే పరిపాలన ఏ విధంగా చేయగలమని ప్రశ్నించారు. ఇటువంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. వీటన్నింటిపై రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి చర్చ జరుపుతామని చెప్పారు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి లేదా రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కమిషన్‌ ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల డిమాండ్స్ తీసుకునేలా చూస్తామని చెప్పారు. ముందుగా మండలాల రేషనలైజ్ కావాల్సి ఉందని తెలిపారు. ‘‘కొందరు మిత్రులు వివిధ రకాల డిమాండ్స్ చేస్తున్నారు. హైదరాబాద్ పేరు, సైబరాబాద్ పేరు, మేడ్చల్ మల్కాజ్‌గిరి పేరు నేను పెట్టినవి కావు మున్సిపల్, పోలీసు కమిషనరేట్లలో ఈ మూడు పేర్లే వచ్చాయి అయితే పోలీసు కమిషనరేట్ల ఏరియాల సరిహద్దులను అడ్జెస్ట్ చేశాం… ఒకాయన సికింద్రాబాద్‌ మీద కక్ష గట్టామని అంటున్నారు అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నది ఎక్కడ?, నేను తీసింది ఎక్కడ? హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, ఇవి జీహెచ్‌ఎంసీలో భాగంగా ఉన్నాయి హైదరాబాద్‌ జిల్లాలోనే సికింద్రాబాద్ ఉంది, మేము దానిని ముట్టుకోలేదు కదా అయితే రాచకొండ కమిషనరేట్ పేరును మాత్రం మార్చాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *