పయనించే సూర్యుడు న్యూస్ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి త్వరలో అన్ని విషయాలు మాట్లాడతాను: ఏపీ సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు. వివరాలు తెలంగాణ అసెంబ్లీలో కృష్ణానదీ జలాలపై శనివారం నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించానని చెప్పుకొచ్చారు. అది తన చిత్తశుద్ది అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఖండించింది. దీంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటన ముగించుకుని చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్లోని పిన్నమనేని సాయిబాబా నివాసానికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, టీడీపీ కార్యకర్త అయిన సాయిబాబా ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాయిబాబా కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు పిన్నమనేని సాయిబాబా మృతి బాధాకరమని అన్నారు. సాయిబాబా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చివరి శ్వాస వరకు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి సాయిబాబా అని అన్నారు. ఎన్టీఆర్ అభిమానిగా వచ్చి పార్టీ కోసం ఎనలేని సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. అయితే సాయిబాబా ఇంటికి చంద్రబాబు రావడంతో అక్కడికి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు వెళ్లిపోతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు స్పందన తెలుపాల్సిందిగా మీడియా ప్రతినిధులు అడిగారు. దీనిపై స్పందించిన చంద్రబాబు త్వరలోనే అన్ని విషయాలు మాట్లాడతామని చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఏపీ సర్కార్ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని పేర్కొంది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అధికార, విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. ఏపీ నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని తెలిపింది. జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టారని. రాయలసీమకు రోజుకు 3 టీఎంసీలంటూ ప్రకటనలతో జగన్ ప్రభుత్వం పనులు చేపట్టిందని తెలిపింది. జగన్ ప్రచారంతో లిఫ్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందని అలాగే కేంద్రం, ఎన్జీటీతో పాటు పలుచోట్ల ఫిర్యాదు చేసిందని పేర్కొంది. ఈ క్రమంలోనే అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ, కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని తెలిపింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆ పనులు నిలిచిపోయాయని పేర్కొంది.