ఆస్తి పన్ను బకాయిలకు ఓటీఎస్

* 90 శాతం వడ్డీ రాయితీ ప్రకటించిన GHMC.

జనం న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా పేరుకుపోయిన బకాయిలాను వసూలు చేయడంలో భాగంగా మరోసారి వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ (ఓటీఎస్)ను తీసుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా పేరుకుపోయిన బకాయిలాను వసూలు చేయడంలో భాగంగా మరోసారి వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ (ఓటీఎస్)ను తీసుకొచ్చింది. తద్వారా 90 శాతం వడ్డీ రాయితీతో ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఓటీఎస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం జీహెచ్ఎంసీ లేఖ రాయగా. ఇందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జీహెచ్ఎంసీలో నగర శివారు ప్రాంతంలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్‌లు విలీనం కాగా. ఆ ప్రాంత ప్రజలకు కూడా ఈ స్కీమ్ వర్తించనుంది. జీహెచ్‌‌ఎంసీ పరిధి మొత్తానికి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. బకాయి పడ్డ ఆస్తిపన్ను మొత్తంతో పాటు, దానిపై పేరుకుపోయిన వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయనున్నారు. అయితే ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరుగుతున్నాయని. ఈ స్కీమ్ మంగళవారం నాటికి పాత జీహెచ్ఎంసీ పరిధిలో, బుధవారం నాటికి విస్తరించిన పరిధిలో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) మొత్తం ఆస్తి పన్నుతో పాటు పేరుకుపోయిన పాత బకాయిలను చెల్లించేవారికి బకాయిల వడ్డీపై 90 శాతం వర్తిస్తుంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తి పన్ను చెల్లించే వారికి ఈ స్కీమ్ అప్లై అవవుతుంది. అలాగే 2025 మార్చి 31 వరకు ముందు ఉన్న బకాయిల వడ్డీపై మాత్రమే రాయితీ వర్తించనుంది. ఇక, ఇందుకోసం చెల్లింపుదారులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ https://onlinepayments.ghmc.gov.in/‌ను సందర్శించడం ద్వారా బకాయిలు చెల్లించవచ్చు. అలాగే జీహెచ్ఎంసీ యాప్, మీ సేవా సెంటర్లలలో కూడా ఇందుకు సంబంధించిన చెల్లింపులు చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *