జనం న్యూస్: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్పూర్తితో 29 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించాలని ఎన్టీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసినట్టుగా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్పూర్తితో 29 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్, జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నారా భువనేశ్వరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు చేయూత అందిస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు ట్రస్ట్ను ప్రారంభించారని చెప్పారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించాలని ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగిందని. చంద్రబాబు అనుకున్న విధంగానే తాను కూడా ట్రస్టీగా ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నానని తెలిపారు. వైద్య సేవలు, విద్యా, మహిళా సాధికారతకు ఆలోచన చేసి అందుకు తగ్గ సాయం అందిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం అత్యవసర సేవలు అందించాల్సి వస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు సిఫారసు చేస్తామని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు మందుకొచ్చి తమవంతు సహకారం అందిస్తున్నారని భువనేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశాక రెండు తెలుగు రాష్ట్రాల్లో 16,365 హెల్త్ క్యాంపులు నిర్వహించి 22.64 లక్షల మందికి వైద్య సేవలు అందించామని భువనేశ్వరి తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం రూ.22.97 కోట్ల విలువైన మందులను బాధితులకు పంపిణీ చేశామన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలని 2,083 మొబైల్ క్యాంపులు ద్వారా వైద్య సేవలు అందించామని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనాథ పిల్లలను కూడా చదివిస్తున్నామని చెప్పారు. 2,113 మంది అనాథలకు విద్యను అందించడమే కాకుండా వారికి అవసరాలు తీర్చుతున్నామని తెలిపారు. పేదపిల్లలకు రూ.3.5 కోట్ల మేర స్కాలర్పిప్లతో పాటు మరో 4,297 మంది కాలేజీ విద్యార్థులకు రూ.2.70 కోట్లు ఆర్థిక సాయం అందించామని తెలిపారు.