సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం సమగ్రాభివృద్ధికి సహకరించాలి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. విద్యారంగంపై ప్రభుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. అయితే ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థ(ఎస్పీసీ)ని ఏర్పాటు చేయనున్నామని తద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (YIIRS)కు సహకరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పార్లమెంట్లోని ఆమె ఛాంబర్లో సమావేశమయ్యారు.తెలంగాణ వ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాధాన్యతను వివరించారు. విద్యా రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. YIIRS కోసం రూ.21 వేల కోట్లు వ్యయం తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించారు. 5 నుంచి 12 తరగతుల వరకు ఉండే ఒక్కో YIIRSలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, మొత్తంగా 105 పాఠశాలతో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని చెప్పారు. YIIRSలు సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యా హబ్లుగా ఉండటంతో పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలియజేశారు.అత్యాధునిక వసతులు, లేబొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యారంగం సమగ్రాభివృద్ధికి రూ.30వేల కోట్లు రాష్ట్రంలో విద్యా రంగం సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించినున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థ (SPC) ఏర్పాటు చేయనున్నామని… తద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, తెలంగాణలో విద్యా రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ అభినందించారు. YIIRS మోడల్ బాగుందన్న కేంద్ర మంత్రి SPC కి సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు మందాడి అనిల్ కుమార్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.