తెలంగాణ రైజింగ్‌ సమావేశం మోదీని ఆహ్వానించాలి

* రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.

జనం న్యూస్‌: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రోజున కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025‌కు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రోజున కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. సదస్సులో పాల్గొనే ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్ఫష్టం చేశారు. ఈ సదస్సుకు హాజరు కావాలని ఇప్పటికే 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందించామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ. పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, వక్తలకు సమయం ముందుగానే నిర్దేశించి క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఉండాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *