అమరావతి అభివృద్ధికి నూతన వెలుగు

* శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రి "నిర్మలా సీతారామన్"

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో మరో కీలక ఘట్టం ఆశిష్కృతం కానుంది. రాజధాని నగరంలో ఒకేసారి 12 బ్యాంకు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్బీఐ, ఎస్‌బీఐ సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు గాను సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం వద్ద సభా వేదికగా ఏర్పాటు చేయనున్నారు. దీని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి భారీగా నిధులు రాబడుతోంది. రాజధాని అమరావతిలో ఈఒకేసారి 12 బ్యాంకుల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 28న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‌ చేతులు మీదుగా ఈకార్యక్రమం జరగనుంది అని సమాచారం. అయితే గత నెలలోనే ఈ కార్యక్రమం జరుగుతుందని భావించారు. కానీ అప్పుడు కుదరలేదు. ఈక్రమంలో నవంబర్ 28న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా కార్యక్రమం జరుగబోతుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సహా మొత్తం 25 నేషనల్, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు అధికారుల నివాస భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలోని CRDA ప్రధాన కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అన్ని బ్యాంకు భవనాలకు ఒకేసారి పునాది రాయి వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలుస్తోంది. శంకుస్థాపన కార్యక్రమం ముగిస్తే.. అవి నిర్మాణ పనులు ప్రారంభిస్తాయి అంటున్నారు. ఈ బ్యాంకు భవనాలు నిర్మించడం కోసం ఇప్పటికే వీటికి ఉద్దండరాయునిపాలెం వద్ద స్థలాలు కేటాయించారు. సభా వేదికపై నుంచి ఒకేసారి అన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్యాలయానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్యాంకుల భవనాల నిర్మాణాలకు 2014-19 మధ్యలోనే స్థలాలు కేటాయించారు. కానీ అప్పుడది ముందుకు సాగలేదు. అమరావతిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు 3 ఎకరాల స్థలం కేటాయించారు. ఎస్బీఐ ఇక్కడ 14 అంతస్తులు భవనం నిర్మిస్తోంది. అలానే బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ , ఇండియన్ బ్యాంక్, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, పీఎన్‌బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో పాటుగా బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన భవనాల నిర్మాణం ఒకేసారి మొదలుకానుంది. ప్రధాని నరేంద్ర మోదీ రూ.58 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అదే సమయంలో ప్రైవేటు సంస్థలు కూడా తమకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నాయి. దీంతో అమరావతిలో 12వేల మంది కార్మికులు వివిద సైట్ల వద్ద పని చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *