ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్

★ పెండింగ్ బిల్లులు విడుదల

జనం న్యూస్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పెండింగ్‌లో ఉన్న రూ. 28.5 కోట్లు బిల్లులను క్లియర్ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పెండింగ్‌లో ఉన్న రూ. 28.5 కోట్లు బిల్లులను క్లియర్ చేసింది. ఇందుకు సంబంధించి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వివరాలను వెల్లడించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ గత వారంలో రూ. 28.50 కోట్ల విలువైన పెండింగ్ ఇందిరమ్మ గృహ బిల్లులను క్లియర్ చేసిందని తెలిపారు. దీని వలన 2,764 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరిందని చెప్పారు. ఎల్ 3 కేటగిరీ కింద 1,200 మంది లబ్దిదారులకు రూ. 12.06 కోట్లు విడుదల చేసినట్టుగా తెలిపారు. అలాగే, గత చెల్లింపులు విఫలమైన 653 మంది లబ్ధిదారులకు రూ.7 కోట్లు క్లియర్ చేసినట్టుగా చెప్పారు. వివరణాత్మక ధృవీకరణ తర్వాత 911 మంది లబ్ధిదారులకు రూ. 9.40 కోట్లు విడుదల చేయడానికి కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు చెల్లింపు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు... ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింకేజ్, వ్యక్తిగత వివరాలను సరిచేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇదిలాఉంటే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం రోజున ఖమ్మం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ... పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మార్చి నెలాఖరుకు లక్ష ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. గత పాలకులు పదేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లు కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. మార్చి చివరి నాటికి లక్షఇండ్లు గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.