టీడీపీ బలోపేతానికి మంత్రి లోకేశ్ చర్యలు

★ కొత్త వ్యవస్థ ప్రారంభం.

జనం న్యూస్: ‘తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనా పరంగా బిజీబిజీగా ఉండటంతో మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాత్రం పార్టీ బలోపేతంపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ‘తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనా పరంగా బిజీబిజీగా ఉండటంతో మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాత్రం పార్టీ బలోపేతంపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. కార్యకర్తే అధినేత అని పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేశ్ ఏ జిల్లాలో పర్యటించినా కార్యకర్తలతో ప్రత్యేకంగా మమేకం అవుతున్నారు. ఆయా నియోజకవర్గంలో సమస్యలతోపాటు కో ఆర్డినేషన్ ఇతర అంశాలపై దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవలే ప్రతీ జిల్లా నుంచి ప్రజాప్రతినిధులను తన ఇంటికి ఆహ్వానించి ఆత్మీయ విందు సైతం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంతో అంతా ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు అధిష్టానానికి నేతల మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా చూడటమే ప్రధాన అజెండగా తెలుస్తోంది. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేశ్. ఫీడ్ బ్యాక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ ద్వారా కార్యకర్తల నుంచే నేరుగా సూచనలు తీసుకునేలా ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పార్టీలో సంస్కరణలకు టీడీపీ పెద్దపీట పరిపాలనలోనే కాదు పార్టీలో సంస్కరణలకు పెద్ద పీట వేస్తోంది టీడీపీ. పార్టీని బలోపేతం చేసే దిశగా ఇప్పటికే వివిధ సంస్కరణలు తెచ్చిన టీడీపీ అధినాయకత్వం.. మరో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. పార్టీ కార్యకర్తల బలమే పునాదిగా కొనసాగుతున్న టీడీపీలో ఇప్పుడు కార్యకర్తల మనోభావాలకు మరింత పెద్ద పీట వేస్తూ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఫీడ్ బ్యాక్ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ అధిష్టానం. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నేరుగా తెలుసుకునేందుకు. కార్యకర్తల నుంచే నేరుగా సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈ కమిటీ పని చేయనుంది. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు నేతృత్వంలో త్రిసభ్య కమిటీ. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు నేతృత్వంలో త్రిసభ్య కమిటీ కేడర్ ఫీలీంగ్స్ లీడర్ కు చేర్చేలా ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ వ్యవహరించనుంది. ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను కొందరు నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పార్టీని ఓ కుటుంబంగా భావించి కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తోన్న టీడీపీ అధినాయకత్వం క్షేత్ర స్థాయిలోని వివిధ అంశాలను బహిరంగంగా కాకుండా నేరుగా పార్టీ దృష్టికి తెచ్చేందుకు లోకేష్ ఆదేశాలతో ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ ఏర్పాటైంది. దీంట్లో భాగంగా పామర్రుకు చెందిన సోషల్ మీడియాలో యాక్టివుగా ఉండే టీడీపీ కార్యకర్తతో ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ భేటీ అయింది. ఆ కార్యకర్త అభిప్రాయాలను సలహాలను టీడీపీ అధిష్టానం స్వీకరించింది.