డ్వాక్రా మహిళలకు రూ.10 వేల నుంచి లక్ష వరకు రుణాలు

జనం న్యూస్: ఏపీలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక సహకారం కోసం ‘ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ’ పథకాన్ని మార్చి నెలలో ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహ అవసరాలకు రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రామహిళలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపికబురు చెప్పింది. డ్వాక్రా సంఘంలోని సభ్యులు అయిన మహిళల పిల్లల ఆర్థిక సహాకరం కోసం ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. డ్వాక్రా మహిళలు తమ పిల్లల వివాహ అవసరాల కోసం మరో పథకాన్ని ప్రభుత్వం మార్చి నెలలో ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహ అవసరాల నిమిత్తం రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఈ మేరకు ‘ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి’ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళల కుమార్తెల కోసం రూ.10వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. డ్వాక్రా మహిళలకు రూ.లక్ష వరకు రుణం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక సహకారం కోసం ‘ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈనెలలోనే ఈ పథకాన్ని ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. అయితే కేవలం పావలా వడ్డీతో ఈ రుణాలను పొందవచ్చు అని తెలుస్తోంది. అయితే తీసుకున్న ఈ నగదు మెుత్తాన్ని 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అవసరమైన పత్రాలు. కళ్యాణ లక్ష్మి పథకానికి అర్హత పొందాలంటే వివాహానికి సంబంధించిన లగ్నపత్రికతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, పెళ్లి ఖర్చుల అంచనాలను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత రుణ మంజూరు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, పెళ్లి ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ముఖ్యమైన సమాచారం రుణం మంజూరు: రూ.10 వేలు నుంచి రూ.లక్ష రూపాయల వరకు వడ్డీ: పావలా వడ్డీ(25పైసలు) చెల్లింపులు: రుణ మెుత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలి గడువు: 24 నుంచి 48 నెలల వ్యవధిలో రుణం మెుత్తాన్ని చెల్లించాలి పథకం మార్గదర్శకాలు ఇవే 1.లోన్ తీసుకోవాలనుకునే మహిళలు ఖచ్చితంగా డ్వాక్రా సంఘాలలో సభ్యురాలై ఉండాలి. డ్వాక్రా సంఘంలోని సభ్యులుగా ఉన్న మహిళల పిల్లలు పెళ్లి కోసం లోన్ వచ్చే అవకాశం. 2.యువతి పెళ్లి వయసు దాటి ఉండాలి. 3.ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.10వేల నుంచి లక్ష రూపాయలు వరకు రుణం మంజూరు అవుతుంది. వడ్డీ కేవలం 25శాతం మాత్రమే. 5.రుణాన్ని కనీసం 24 నెలలలో గరిష్టంగా 48 నెలల్లోగా వాయిదాల రూపంలో చెల్లించాలి. ఎన్టీఆర్ విద్యాసంకల్పం కింద డ్వాక్రా మహిళలకు లోన్ మరోవైపు డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్న మహిళలు చదువుకుంటున్న పిల్లలను కలిగి ఉంటే వారిని చదివించేందుకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు కొత్త పథకానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. విద్యార్థుల విద్య సక్రమంగా కొనసాగించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఆ మహిళలకు నాలుగు శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనుంది. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా , వారు అధిక వడ్డీతో ప్రైవేట్ సంస్థల వద్ద , వ్యక్తులు వద్ద రుణాలను తీసుకుని అప్పుల ఊబిలోకి పోకుండా కాపాడేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ప్రభుత్వం నామకరణం చేసింది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)విభాగం ఈ పథకానికి నోడల్ డిపార్ట్మెంట్‌గా పనిచేస్తోంది.