భారత్ బ్రెజిల్ మధ్య వాణిజ్య ఒప్పందం

* చైనాకు వ్యూహాత్మక ప్రతిస్పందనగా మోదీ చర్యలు.

జనం న్యూస్: ఓవైపు భారత్ అమెరికా అలాగే యూరప్ దేశాలతో వరుసగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో తాజాగా బ్రెజిల్ దేశంతో కూడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సరికొత్త అధ్యయానికి తెరలేపింది అని చెప్పవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వాతో అధికారికంగా చర్చలు జరిపారు. ఇందులో ప్రధానంగా ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మెరుగు పరుచుకునే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. ఓవైపు భారత్ అమెరికా అలాగే యూరప్ దేశాలతో వరుసగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో తాజాగా బ్రెజిల్ దేశంతో కూడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సరికొత్త అధ్యయానికి తెరలేపింది అని చెప్పవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వాతో అధికారికంగా చర్చలు జరిపారు. ఇందులో ప్రధానంగా ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మెరుగు పరుచుకునే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ప్రధానంగా క్రిటికల్ మినరల్స్, అలాగే వాణిజ్య సహకారం విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా ఇరు దేశాలు క్రిటికల్ మినరల్స్, అలాగే గనుల మైనింగ్ సంబంధించి పరస్పర సహకారం కోసం ఎంఓయూ కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న క్లీన్ ఎనర్జీ కోసం ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చైనా ఈ విభాగంలో గ్లోబల్ లీడర్ గా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా భారత్ సైతం క్రిటికల్ మినరల్స్ విషయంలో ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగు పరుచుకునేందుకు, ప్రధాన ఒప్పందాల్లో భాగంగా ప్రస్తుతం ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 15 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతేకాదు భారత్ ప్రస్తుతం బ్రెజిల్ కు 10వ అతిపెద్ద ఎగుమతి దారుగా ఉంది. అయితే ఈ వాణిజ్య విలువను 20 బిలియన్ డాలర్లుగా మార్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ లక్ష్యం దాటించేందుకు అనేక చర్యలు తీసుకునేందుకు ఈ ఒఫ్పందంలో పేర్కొన్నారు. అలాగే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిటికల్ మినరల్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలు బ్రెజిల్ వద్ద ఉండటం విశేషం. ప్రస్తుతం వీటి వాడకం ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, బుల్లెట్ ట్రెయిన్స్, స్మార్ట్ ఫోన్స్, డేటా సెంటర్లలో కూడా వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చైనా ఈ విభాగంలో గ్లోబల్ లీడర్ అయ్యింది. అయితే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం బ్రెజిల్ సహకరిస్తున్న నేపథ్యంలో ఈ మినరల్స్ విషయంలో చైనాతో పోటీపడేందుకు ఈ సహకార ఒప్పందం తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోడీ భారతదేశం ప్రస్తుతం క్రిటికల్ మినరల్స్ విషయంలో ముందడుగు వేయాలని పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రెజిల్ తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఆ దిశగా అడుగులు వేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *