జనం న్యూస్: అమరావతి నిర్మాణ పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా పుంజుకున్నాయి. హైకోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా ఒకేసారి 4 రాఫ్ట్లలో కాంక్రీట్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా పుంజుకున్నాయి. శుక్రవారం హైకోర్టు నిర్మాణ ప్రాంగణంలో ఒకేసారి 4 రాఫ్ట్లలో (Rafts) కాంక్రీట్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (AGICL) ఎండీ శ్రీనివాస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ… ఏకధాటిగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ స్లాబ్ (రాఫ్ట్) పనులను నేడు చేపట్టాం. మొత్తం నిర్మాణంలో 65,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగిస్తుండగా, ఇప్పటికే 15,000 క్యూబిక్ మీటర్లు పూర్తయింది. నేటితో మరో 15,000 క్యూబిక్ మీటర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి అని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. హైకోర్టు భవన నిర్మాణం పూర్తిచేస్తాం ఇకపోతే హైకోర్టు భవనాన్ని B+G+8 (బేస్మెంట్ + గ్రౌండ్ + 8 అంతస్తులు)విధానంలో 50.4 మీటర్ల ఎత్తుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం’ అని పురపాలక శాఖ మంత్రి నారాయణ వివరించారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనంలో 52 కోర్టు హాళ్లు అందుబాటులోకి రానున్నాయి. నిర్మాణంలో అత్యంత కీలకమైన ‘రాఫ్ట్ ఫౌండేషన్’ పనులు పూర్తయితే, మిగిలిన భవన నిర్మాణం చాలా వేగంగా కొలిక్కి వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధానిలో కేవలం కార్యాలయాలే కాకుండా, పాలన సాగించే యంత్రాంగం కోసం నివాసాల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మార్చినాటికి 3,500 ఇళ్లు పూర్తి ఇకపోతేఅమరావతిలో అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,026 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది అని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. 3,500 ఇళ్లను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ముఖ్యంగా IAS అధికారుల నివాస భవనాలు ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, నాణ్యతతో కూడిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. 7 కొత్త సంస్థలకు భూ కేటాయింపులు. ఇదిలా ఉంటే శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది. అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. ఈ సమావేశానికి హాజరైన మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, సంధ్యా రాణిలు హాజరయ్యారు. మొత్తం 22 సంస్థలకు కేటాయింపులపై సమావేశంలో చర్చ జరిగింది.7 కొత్త సంస్థలకు భూ కేటాయింపులకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. 11సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేశాం అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘రాజధాని అమరావతిలో ఒక సంస్థకు భూ కేటాయింపు అంశం పెండింగ్లో ఉంది.బ్యాంకుల సిబ్బంది కొరకు రెసిడెన్షియల్ స్థలం కోసం భూ కేటాయింపునకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది.భారత వాతావరణ శాఖ కు ఎకరా భూమి కేటాయించాం’అని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.‘ETPRకు 0.74 ఎకరాలు కేటాయించాం. KVB కి 0.4 ఎకరాలు, నాబార్డ్కి ఎకరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్కు అర ఎకరా, రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్కు 2 ఎకరాలు కేటాయింపునకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ భూములు పొందిన సంస్థలు నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే దానిపై సమావేశంలో చర్చించాం.అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. దేశం మొత్తం అమరావతి నిర్మాణం వైపు చూస్తుంది’అని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.