తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 26 నుంచి ప్రారంభం.

*28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 26న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 28వ తేదీన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది.ఇప్పటికే ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 22 తో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సైతం ముగియనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయంచింది. ఈనెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈనెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న బడ్జెట్ ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 28వ తేదీన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సారి 10 నుంచి 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆర్థిక శాఖ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతోంది.ఇప్పటికే బడ్జెట్‌ ప్రక్రియను పూర్తి చేసిన ఆర్థిక శాఖ తుది మెరుగులు దిద్దుతుంది. మరోవైపు ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈనెల 28న శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు వెల్లడించారు.సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటు…పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలనే యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే ప్రాంగణంలో శాసన సభ,మండలి సమావేశాలు ఇకపోతే శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఒకే ప్రాంగణంలో జరగనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలి సమావేశాలు పాత అసెంబ్లీ హాల్లో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అసెంబ్లీ సిబ్బంది ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *