భవిష్యత్తు తరాలకు అవకాశాల గనిగా ఆంధ్రప్రదేశ్

★ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడదాం: ఎమ్మెల్సీ నాగబాబు

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌ను ఎమ్మెల్సీ నాగబాబు స్వాగతించారు.ఈ సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లు అద్భుతం అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం లక్ష్యాలు, సంక్షేమం, అభివృద్ధికి అస్త్రంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర రెవెన్యూ లోటు క్రమంగా తగ్గిస్తూ మెరుగైన ఫలితాలు సాధించడం చూస్తున్నాం అని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ అండదండలతో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ప్రవేశ పెట్టిన వ్యవసాయ బడ్జెట్ హర్షణీయం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు కొనియాడారు. కూటమి ప్రభుత్వం లక్ష్యాలు, సంక్షేమం, అభివృద్ధికి అస్త్రంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర రెవెన్యూ లోటు క్రమంగా తగ్గిస్తూ మెరుగైన ఫలితాలు సాధించడం చూస్తున్నాం అని అన్నారు. కూటమి ప్రభుత్వం మూలధన వ్యయం కేటాయింపులు గణనీయంగా పెంచింది.మూలధనం వ్యయం పెంచడం ద్వారా మెరుగైన భవిష్యత్తును అంచనా వేయవచ్చు అని ఎమ్మెల్సీ నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది ‘ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనదు అనే భావన గత పాలకులపై ఉంటే...పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అన్న నమ్మకాన్ని రైతుల్లో తీసుకు వచ్చాం. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలోనే అగ్రగామిగా పని చేస్తోంది’అని ఎమ్మెల్సీ నాగబాబు పేర్కొన్నారు. ‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పనులు చేయిస్తున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు కేటాయించిన 22,942 కోట్ల రూపాయలతో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకు వెళ్ళవచ్చు’అని ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ విజన్‌ను అనుసరిద్దాం ‘అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలకు 714 కోట్లు కేటాయించడం ద్వారా 50 శాతం గ్రీన్ కవర్ లాంటి ప్రాజెక్టులకు ఊతం ఇస్తుంది.పోలవరం ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, రైతు సంక్షేమం, రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు మునుపెన్నడూ చూడని బడ్జెట్ కేటాయింపులు జరగడం అన్నదాత పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న శ్రద్దను చాటి చెప్పింది’అని ఎమ్మెల్సీ నాగబాబు పేర్కొన్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి వైభవం తీసుకు వచ్చేలా, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాలను అందిపుచ్చుకునేలా భవిష్యత్తు తరాలకు అవకాశాల గనిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజన్ అనుసరిద్దాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడదాం’అని ఎమ్మెల్సీ నాగబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.