పయనించే సూర్యుడు న్యూస్ : ప్రపంచంలోనే గొప్ప దేవుడు అయిన తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు నాయుడు నడిరోడ్డుపైకి లాక్కొచ్చానని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.ఒకవైపు సీఎంగా ఉంటూనే మరోవైపు తన సంస్థ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు మరోవైపు నెయ్యి సరఫరా చేస్తున్నందుకు ఆయన సీఎం కుర్చీ నుంచి తప్పుకోవాలి అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో డిజిటల్ హాజరుపై శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సభ్యుల డిజిటల్ హాజరు నమోదుకు తాము వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు. ‘ఎమ్మెల్యేలు శాసన సభ కు రాకపోతే వారిపై అనర్హత వేటు వేసే నిబంధన చట్టం…రాజ్యాంగంలో ఉంటే దానిని ఫాలో కావచ్చు. దానికి మేము వ్యతిరేకం కాదు. ఈ విషయంలో మా వైపు నుంచి కామాలు , పులుస్టాపులు లేవు. ప్రపంచంలోనే గొప్ప దేవదేవుడు వెంకటేశ్వర స్వామి.అలాంటి స్వామిని నడి రోడ్డు మీదకు లాగాడు సీఎం చంద్రబాబు నాయుడు అని శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం పదవి నుంచి తప్పుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో కేజీ నెయ్యి రూ. 321 దాటి ఎప్పుడూ కొనలేదు లేదు అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పుడు అదే కేజీ నెయ్యి రూ.658కి ఎలా కొంటున్నారు అని ప్రశ్నించారు.కడప మేయర్ సురేష్ పదవిలో ఉండి కార్పొరేషన్ కాంట్రాక్ట్ పని చేసుకున్నాడని ఆయన్ని పదవి నుంచి తప్పించారు.మరి సీఎం చంద్రబాబు నాయుడు పదవిలో ఉంటూ తన సంస్థ ద్వారా టీటీడీ కి నెయ్యి సరఫరా చేయిస్తున్నారు అని మండిపడ్డారు. కడప మేయర్ ను తప్పించినట్లే చంద్రబాబు నాయుడు సీఎం పదవి నుంచి తప్పుకొంటారా?. ఆయన పదవి నుంచి తప్పుకోకపోతే ప్రతి పక్షంగా మేము ఊరు కుంటామా?అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల నిరసన మరోవైపు శాసన మండలిలో తిరుమలకు నెయ్యి సరఫరాపై వైసీపీ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. అయితే శాసన మండలి చైర్మన్ చర్చకు నిరాకరించారు. దీంతో స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. అమరావతి ఏపీ శాసనమండలి సమావేశాల్లో ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ డైరీ టీటీడీకి నైయ్యి సరఫరా చేయడంపై వైసీపీ సభ్యులు సభలో చర్చకు డిమాండ్ చేశారు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై అధికార పార్టీ చర్చకు నిరాకరించి దాటవేసే దొరనిలో సమాధానం చెప్పడంతో వైసీపీ సభ్యులు ప్లకార్డులు చేపతబట్టి స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలియజేశారు. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే తెలుగుదేశం పార్టీ శఠగోపం పెట్టే ప్రయత్నం చేస్తుందని వైసీపీ శాసన మండలి సభ్యులు ఆరోపించారు. దీనిపై ఖచ్చితంగా చర్చ జరగాలని వారు శాసనమండలిలో డిమాండ్ చేశారు. సభలో గోవిందా గోవిందా అంటూ వైసీపీ సభ్యుల నిరసన తెలిపారు.