జనం న్యూస్; మేడారం మహాజాతరలో మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ ఆదాయం సమకూరింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు వారం రోజుల్లోనే రూ. 3 కోట్లకుపైగా లాభం చేకూరింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడారం మహాజాతరలో మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ ఆదాయం సమకూరింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు వారం రోజుల్లోనే రూ. 3 కోట్లకుపైగా లాభం చేకూరింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలు స్టాళ్లు, క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలోని 10 మండలాలకు చెందిన 565 ఆదాయ యూనిట్లను ఎస్హెచ్జీ గ్రూపుల ద్వారా ఏర్పాటు చేసినట్టుగా సీతక్క తెలిపారు. ఇందుకోసం అవసరమైన పెట్టుబడి కోసం రూ. 6 కోట్లను బ్యాంకుల ద్వారా రుణంగా అందించారు. . వారం రోజుల్లో మొత్తం రూ.9.12 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో పెట్టుబడి రూ. 6 కోట్లు పోగా. రూ.3 కోట్ల వరకు లాభం పొందారు. అయితే మేడారం జాతర మేడారం జాతర ప్రాంగణంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు అనుకూలమైన ప్రదేశాల్లో షాపులను కేటాయించామని తెలిపారు. ములుగు జిల్లాలోని 10 మండలాలకు చెందిన మహిళా సమాఖ్యల ద్వారా వివిధ రకాల వ్యాపార యూనిట్లు ఏర్పాట్లు చేయించి మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించినట్టుగా చెప్పారు. ఇక, మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసినవాటిలో చికెన్ సెంటర్లు, ఇప్పపువ్వు లడ్డూ, బ్యాంబూ చికెన్, వివిధ రకాల క్యాంటీన్లు, స్నాక్స్ స్టాళ్లు ఉన్నాయని మంత్రి సీతక్క తెలిపారు. ఇదిలాఉంటే, మేడారం జాతరంలో హుండీ ఆదాయం రూ. 13.25 కోట్లు లభించింది. మేడారంలో సమ్మక్కకు సంబంధించి 309 ఐరన్ హుండీలు, సారలమ్మకు సంబంధించి 309 ఐరన్ హుండీ, గోవిందరాజుకు సంబంధించి 81 ఐరన్ హుండీలు, పగిడిద్దరాజుకు సంబంధించి 81 ఐరన్ హుండీలు ఉంచారు. మొత్తంగా 780 ఐరన్ హుండీలతో పాటు మేడారం జాతరలో 45 క్లాత్ హుండీలు, మూడు ఒడి బియ్యం హుండీలు ఏర్పరాటు చేశారు. ఇలా మొత్తంగా 828 హుండీలు ఏర్పాటు చేశారు. ఈ హుండీలను హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంకు తరలించి అక్కడ లెక్కింపు చేపడుతున్నారు. ఇందుకోసం వివిధ బ్యాంకుల సిబ్బంది సహకారం కూడా తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన రోజున లెక్కింపు ప్రారంభం కాగా. ఫిబ్రవరి 11తో ముగిసింది. మొత్తం 828 హుండీలను లెక్కించగా రూ.13,25,83,269 ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ హుండీలలో భక్తులు నగదుతో పాటు బంగారం, వెండితో చేసిన అభరణాలు, పలు వస్తువులను మొక్కులుగా సమర్పించారు. విదేశీ కరెన్సీ నోట్లను కొందరు భక్తులు హుండీలలో వేశారు. ప్రస్తుతం వాడుకలో లేని పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను సైతం కొందరు భక్తులు సమర్పించారు. మరికొందరు పేపర్లపై, నోట్లపై తమ కోరికలను తీర్చాలంటూ వేడుకుంటూ రాసి హుండీలలో వేశారు.