మున్సిపల్ ఎన్నికలపై కట్టుదిట్టమైన నిబంధనలు

* ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష!

జనం న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రేపు (ఫిబ్రవరి 11)న పోలింగ్ జరగనుండగా. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అయితే పోలింగ్ ప్రచార సమయం ముగియడంతో. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటి సభలు, ఊరేగింపులు నిర్వహించడం గానీ, పాల్గొనడం గానీ చేయరాదని స్పష్టం చేసింది. అభ్యర్థులు, ఆయా పార్టీల ప్రతినిధులు ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేయకూడదని తెలిపింది. టీవీలు, ఇతర ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఎలాంటి ఎన్నికల ప్రచారం చేపట్టరాదని పేర్కొంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి పత్రికలు, న్యూస్‌ ఛానళ్లతోపాటు ఈసారి మొబైల్‌ఫోన్లు, సోషల్‌ మీడియాపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొబైల్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేసినా చర్యలు ఉంటాయని పేర్కొంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం పోలింగ్ ముగిసేవరకు 48 గంటలపాటు తాము జారీ చేసిన నిబంధనలు పాటించాలని తెలిపింది. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించి ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. అలాగే ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్‌ శాఖను ఆదేశించింది. ఇదిలాఉంటే, ఇక, తెలంగాణ రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలోని 2,582 వార్డులు కలిపి మొత్తం 2,996 మంది సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ గత మంగళవారం (ఫిబ్రవరి 3) రోజున ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవమైన స్థానాల వివరాలను అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వార్డులు ఏకగ్రీవం అయినట్టుగా తెలిపింది. అయితే ఏకగ్రీవాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. మొత్తంగా 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల, 2 చోట్ల బీఆర్ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. అయితే పోలింగ్‌కు సంబంధించిన మెటీరియల్‌తో సిబ్బంది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లనున్నారు. మొత్తం 8,195 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 137 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు అనంతరం… ఈ నెల 16 మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలను పరోక్ష పద్దతిలో నిర్వహించనున్నారు. వేతనంతో కూడిన సెలవు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో పోలింగ్ జరగనున్న బుధవారం రోజున కార్మికులు, ఉద్యోగులకు కార్మికశాఖ ఆ రోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *