చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం

★ వందల సంఖ్యలో కాకుల మృతి

పయనించే సూర్యుడు న్యూస్ : చెన్నై నగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇటీవల వందలాది కాకులు చనిపోగా H5N1 వైరస్ వ్యాప్తి చెందినట్లుగా నిర్దారణ అయింది. చెన్నై నగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇటీవల వందలాది కాకులు చనిపోగా H5N1 వైరస్ వ్యాప్తి చెందినట్లుగా నిర్దారణ అయింది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆరోగ్య అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజలకు ఒక అడ్వైజరీ జారీ చేశారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి బయోసెక్యూరిటీ ప్రోటోకాల్‌ల ప్రకారం కాకులు, కోళ్ల కళేబరాలను దహనం చేయాలని లేదా లోతుగా పూడ్చిపెట్టాలని అధికారులు ఆదేశించారు. చనిపోయిన పక్షులను తాకడం మానుకోవాలని ప్రజలకు సూచించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి గురించి ఏదైనా అనుమానాలు ఉంటే స్థానిక అధికారులకు వెంటనే తెలియజేయాలని కోరారు. అసలేం జరిగిందంటే గత నెలలో చెన్నైలో వందలాది కాకులు అనుమానాస్పద స్థితిలో మరణించాయి. అడయార్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కాకుల మరణాల నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. ఈ శాఖకు చెందిన జంతు వ్యాధుల విభాగం మరణించిన కాకుల నమూనాలను సేకరించింది. ఈ నమూనాలను భోపాల్‌లోని ICAR–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHAS) ప్రయోగశాలలో పరీక్షించగా బర్డ్ ఫ్లూ నిర్దారణ అయింది. అంతేకాకుండా ఈ నమూనాలలో అత్యంత వ్యాధికారక H5N1 స్ట్రెయిన్ నిర్దారణ అయింది. ఇది జూనోటిక్ సామర్థ్యాన్ని కలిగి ఉందని పరీక్షలు నిర్దారించాయి. అంటే ఇది అరుదైన సందర్భాల్లో జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. స్పందించిన కేంద్రం చెన్నై నగరంలోని అడయార్ నుంచి సేకరించిన నమూనాలలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ... తమిళనాడు ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ, సమగ్ర క్షేత్ర పర్యవేక్షణకు చేపట్టాలని ఆదేశించింది. పక్షుల మరణాలను నిశితంగా పరిశీలించాలని కోళ్లపై నిఘాను తీవ్రతరం చేయాలని చెప్పింది. అటవీ, వన్యప్రాణుల విభాగాలను అప్రమత్తం చేయాలని కూడా రాష్ట్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ క్రమంలోనే తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలలో భాగంగా చనిపోయిన పక్షులను వట్టి చేతులతో తాకరాదని ప్రజలకు సూచించారు. పక్షుల మృతదేహాలను పట్టుకునేటప్పుడు చేతి తొడుగులు ధరించాలని తర్వాత సబ్బు, నీటితో చేతులు బాగా కడుక్కోవాలని కూడా ఆదేశించింది. ‘‘పక్షుల నుంచి మానవులకు ఈ వైరస్ సంక్రమించడం చాలా అరుదు. మరణించిన పక్షుల్లో జీవించి ఉన్న వైరస్‌ను తాక, ఆపై నోరు లేదా కళ్ళు వంటి శరీర భాగాలను తాకిన సందర్భాలు తప్ప చరిత్రలో ఇలాంటి కేసులు పెద్దగా నివేదించబడ