జనం న్యూస్: నల్లగొండ ప్రజలతో తనకు ఉన్న అనుబంధంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 5సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నల్లగొండ ప్రజల రుణం తీర్చుకోలేనిదనీ. నల్లగొండ ప్రజలతో తనది విడదీయని ఆత్మీయ బంధం అని అన్నారు. నల్లగొండనే నా ఇల్లు, నల్లగొండనే నా ప్రాణం, నల్లగొండనే నా కుటుం బం, నల్లగొండనే నా జీవితమని,పేదప్రజల మధ్యలో ఉండ డం నాకిష్టమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ‘నాకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎంపీగా,రెండు సార్లు మంత్రిగా మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. రాష్ట్రంలోనే ముఖ్య నాయకుడిగా నన్ను నిలబెట్టారు. మీరు చూపెడుతున్న ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటా. మీకు ఎంత చేసినా తక్కువ’అని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ పట్టణంలో 1వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి ఆలకుంట్ల నాగరాజు, 2వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న గురిజాల నరేందర్( పానగల్-రోడ్ షో), 3వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న గాలి వినోద( పానగల్ & నందీశ్వర -కాలనీ రోడ్ షో)లకు మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. పానగల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద రోడ్షోలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగించారు. ‘మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకులనే కార్పొరేటర్ అభ్యర్థులుగా పెట్టిన. కార్పొరేషన్ ఎన్నిక పేద ప్రజలకు మంచి చేసే ఎన్నికలు.ఇప్పుడు గెలిచే కార్పొరేటర్లు మీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు’అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతీ పేదవాడికి సొంతిల్లు నిర్మిస్తాం. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదు. పేదవాని ఆత్మగౌరవం సొంతిల్లు ఇవ్వలేదు. ఆడబిడ్డలకు కిటికీలకు అడ్డు కట్టుకునే చీరలు ఇచ్చారు. కానీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల,సన్నబియ్యం,ఇందిరమ్మ ఇండ్లు, చీరలు ఇస్తున్నాం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఇందిరమ్మ ఇంటికి 5లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి పేదవారికి సొంతిల్లు నిర్మిస్తా’అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చారు. మీ దీవెనతో నన్ను ఇంకా బలవంతుడిని చేయండి. ‘నా ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్న. మిమ్మల్ని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. 48కి 48 డివిజన్ల కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి ఎక్కువ నిధులు తెస్తా’అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.‘మీ దీవెనతో నన్ను ఇంకా బలవంతుణ్ణి చేస్తారని ఆశిస్తున్నా. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి’అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఇకపోతే మంత్రి కోమటిరెడ్డి రోడ్ షోకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. మేయర్ అభ్యర్థిగా చైతన్య శ్రీనివాస్ రెడ్డి. ఇదిలా ఉంటే నల్లగొండ మునిసిపల్ కార్పొరేషన్కు కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖరారు చేశారు. ఆమెతో పాటు మొదటి విడతలో మొత్తం 44 మంది కార్పొరేటర్ అభ్యర్థుల పేర్లను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అనంతరం మరో నలుగురు కార్పొరేటర్ల పేర్లను ప్రకటించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆమోదంతో, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.