
జనం న్యూస్: టీడీపీ నాయకురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై దాడి ఘటనలో వారి ప్రమేయం ఉందనే ఆరోపణలపై పట్టాభిపురం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలు. అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. అంబటి రాంబాబు సంతకంతో వైకాపా లీగల్ సెల్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఈ క్రమంలోనే పట్టాభిపురం పోలీసులు మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తు కొసాగుతుందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలతో సహా సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జనవరి 31వ తేదీ సాయంత్రం పట్టాభిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు ఆయన ఇళ్లు, కార్యాలయంపై దాడి చేశారు. మరోవైపు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంకు సంబంధించి నమోదైన కేసులో అంబటి రాంబాబును పోలీసులు అదే రోజు రాత్రి భారీ భద్రత మధ్య అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజు అంబటి రాంబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అంబటి రాంబాబుకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. ఇదిలాఉంటే, మంగళవారం రోజున పట్టాభిపురం పోలీసులు అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంకు వెళ్లి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. పలువురి వాంగ్మూలాలను రికార్డు చేశారు. మరోవైపు క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. అంబటి రాంబాబు నివాసం, కార్యాలయం వద్ద ఆధారాలు సేకరించింది. మరోవైపు రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ పార్టీ హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై పుట్టిందని విమర్శించారు. వైసీపీ రెచ్చగొట్టినా వారి ట్రాప్లో పడొద్దని టీడీపీ శ్రేణులకు సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించేలా మంత్రులు, సీనియర్ నేతలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయాలనేదే తమ ప్రధాన ఎజెండా అని. దీనిని చెడగొట్టేందుకు వైసీపీ వాళ్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరతామని తెలిపారు.