లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్

★సింగరేణి సంస్కరణలను గుర్తు చేసిన సీఎం చంద్రబాబు

సాక్షి డిజిటల్ న్యూస్ : విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటపట్టింది. 2024 సెప్టెంబర్ లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి 2026 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.54 కోట్లు లాభం సాధించింది. దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించింది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్ఐఎన్ఎల్ గతంలో ఎదుర్కొన్న నష్టాల నుంచి ప్రస్తుతం లాభాల బాటపట్టింది అని అన్నారు.వెలగపూడిలోని సచివాలయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షనిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా, సీఎస్ విజయానంద్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. హాట్‌మెటల్ ప్రొడక్షన్ లో రోజుకు 19,401 టన్నుల ఉక్కు ఉత్పత్తికి విశాఖ స్టీల్ చేరుకుంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.54 కోట్ల మేర స్టీల్ ప్లాంట్ లాభాలు 2024-25 సెకండ్ క్వార్టర్‌ లో కేవలం రోజుకు 9,215 టన్నుల మాత్రమే ఉత్పత్తి చేసిన విశాఖ ఉక్కు మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పనిచేస్తుండడంతో ఉత్పత్తి భారీగా పెరిగింది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు స్టీల్ ప్లాంట్ కెపాసిటీ యుటిలైజేషన్‌లో విశాఖ ఉక్కు రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరుకుంది అని అన్నారు.2024-25 సెకండ్ క్వార్టర్‌లో కేవలం రోజుకు 45 శాతం మాత్రమే ఉత్పత్తి సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం ఆర్దికంగా నష్టాల నుంచి లాభాల వైపు విశాఖ స్టీల్ పరుగులు పెడుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2024 సెప్టెంబర్ లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి 2026 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.54 కోట్లు లాభం సాధించింది అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. కేంద్ర సహకారంతో నిలదొక్కుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన రూ. 11 వేల కోట్ల సాయంతో విశాఖ స్టీల్ నిలదొక్కుకుంది అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్‌కు క్రెడిట్ రేటింగ్ పెరిగినట్లు సీఎం చంద్రబాబు నాయుడుకు అధికారులు తెలిపారు.అన్ని విభాగాల్లో కొత్త విధానాలు ప్రవేశ పెట్టి ప్లాంట్‌ను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. కార్మికుల, ఉద్యోగుల సమర్థ వినియోగంతో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని సీఎం అభిప్రాయ పడ్డారు.యాజమాన్యం, కార్మికులు, ప్రభుత్వాలు కలిపి విశాఖ ఉక్కును విజయపథంలో నడపాలని సీఎం దిశానిర్దేశం చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి సంస్థలో అమలుచేసిన సంస్కరణలు, కార్మికుల సహకారంతో సాధించిన ఫలితాలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ ఉక్కుకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.