
జనం న్యూస్: కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో నల్లగొండ జిల్లా చండూరులో 9వ వార్డుకు చెందిన కార్యకర్త భూతరాజు వేణు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయా నియోజకవర్గాలలో నామినేషన్లు వేసే చివరి రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిలలా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీలో తనకు బీఫాం ఇవ్వలేదంటూ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం ఒక్కసారిగా కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా క్రియశీలకంగా పనిచేసిన తనకు బీఫాం ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ అతడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆత్మహత్యాయత్నం. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో‘ఆల్ ఈజ్ వెల్’అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని, కార్యకర్తలంతా ఏకతాటిపై ఉన్నారని మీడియా సాక్షిగా ప్రకిటంచేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ప్రకటన చేసి 24 గంటలు కూడా గడవక ముందే పరిస్థితి తలకిందులైంది. చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ (బీ-ఫామ్) దక్కలేదన్న మనస్థాపంతో భూతరాజు వేణు అనే కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. కోలుకుంటున్న వేణు. నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో భూతరాజు వేణు అనే కాంగ్రెస్ నాయకుడు క్రియాశీకలంగా వ్యవహరిస్తున్నారు.ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే పార్టీ బీఫామ్ ఇవ్వకపోవడంతో తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. పార్టీలో కష్టపడ్డ వారికి కాకుండా బయటి వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తున్నారనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశాడు.