
పయనించే సూర్యుడు న్యూస్ : సిట్ నోటీసులపై కేసీఆర్ నిర్ణయం మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేను. అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు లేఖలో తెలిపారు. విచారణ కోసం మరోక తేదీని ఖరారు చేయాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసు విచారణంలో భాగంగా గురువారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం నోటీసులు ఇచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యుత్తరం పంపించారు. శుక్రవారం తాను విచారణకు హాజరుకాలేనని తెలిపారు.మున్సిపల్ ఎన్నికలు, నామినేషన్ల పర్వం కొనసాగున్న వేళ రేపటి విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసేందుకు గడువు రేపు ఒక్కరోజే మాత్రమే ఉంది అని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు కాస్త సమయం కావాలని కోరారు. మరోవైపు ఎర్రవెల్లిలోని ఫామ్హౌజ్లోనే విచారణ చేసుకోవచ్చని పేర్కొన్నారు.అయితే రేపటి విచారణకు వాయిదా వేయాలని కేసీఆర్ లేఖలో విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత విచారణ చేపట్టాలని బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని మాజీ సీఎం కేసీఆర్ లేఖలో వెల్లడించారు. సిట్ సమాధానంపై ఉత్కంఠ ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల దర్యాప్తు విషయంలో కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చారు. ఆ సందర్భంలో కూడా కేసీఆర్ ఇదే తరహాలో వ్యవహరించారు. 2025 జూన్లో విచారణకు రావాల్సిందిగా కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే కొన్ని పనుల వల్ల జూన్ 11 వరకూ సమయం కావాలి కేసీఆర్ కోరారు. అందుకే కమిషన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఇదే తరహాలో గడువు ఇస్తారా? లేక రేపే విచారణ చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ బృందం వెళ్లింది.శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 65 ఏళ్ల వయసు దృష్ట్యా పీఎస్కు రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ పరిధిలోని అనువైన ప్రాంతం వివరాలు తెలపాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు అయిన కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులను సిట్ విచారించిన సంగతి తెలిసిందే.ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను సిట్ బృందం అరెస్ట్ చేసింది. ప్రభాకర్ రావును సైతం పలుమార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించిన సంగతి తెలిసిందే. ఈ అంశాలపై ఆరా తీసే ఛాన్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. ఈమేరకు మాజీ సీఎం కేసీఆర్కు 160 CRPC కింద నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల సమయంలో అధికారంలో ఉన్న కీలక వ్యక్తులకు, ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల గురించి కేసీఆర్ను ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్కు సిట్ బృందం నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.