ఉద్యోగుల కష్టాలు తగ్గాలి… టెక్నాలజీనే మార్గం

★సీఎం చంద్రబాబు హృదయస్పర్శి వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ : రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు.2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మారాలని...ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... ఇక డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. సమర్ధత లేకపోతే శిక్షణ ఇచ్చి, నిరంతరం పర్యవేక్షించాలని తద్వారా ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.సాంకేతికతతో గవర్నెన్స్‌లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృత స్థాయిలో వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 878 ప్రభుత్వ సేవలు 2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మారాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏఐ వినియోగించుకుని గ్రీవెన్సులు సత్వరంగా పరిష్కరించాలని నిర్దేశించారు. మన మిత్ర - వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందించగలుగు తున్నట్టు...ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం రాష్ట్రాభివృద్ధి లో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపడానికి ఎంపీలకు కొన్ని శాఖలను అప్పజెప్పామని... ఆయా శాఖలకు సంబంధించి ఏపీలో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మంత్రులు, సెక్రటరీలతో మాట్లాడాలని అన్నారు. కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సిన సమయాల్లో ఆయా శాఖలకు సంబంధించి కేంద్రంలో ఉన్న ప్రతినిధులతో మాట్లాడి.. రాష్ట్రానికి మేలు జరిగేలా పనులను, నిధులను సాధించాల్సిన బాధ్యతను ఎంపీలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్ర అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఫిబ్రవరిలో జరిగే కలెక్టర్ల సదస్సులో ఎంపీలు అందరూ వర్చువల్‌గా పాల్గొనాలని స్పష్టం చేశారు. వెనకబడిన ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం-నల్లమల సాగర్... ఈ మూడింటిని ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలన్నారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఈ సెషన్లోనే బిల్లు పెట్టనున్నారని... దీనిపై కేంద్రంలోని సంబంధిత మంత్రి, అధికారులతో టచ్ లో ఉండాలని సీఎం సూచించారు. వీటితో పాటు.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందనే అంశాలను పార్లమెంటులో వివిధ సందర్భాల్లో ప్రస్తావించాలని సూచించారు. సభలో టీడీపీకి చెందిన ఎంపీలందరూ మాట్లాడాలని, సమస్యలు ఉత్పన్నమైనా పట్టు వదలకుండా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వివాదాలు వద్దు... నీళ్లు కావాలి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న క్రమంలో ఏపీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా చూడాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు తాజా అంచనాలు ఇచ్చామని సీఎం సమావేశంలో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు... ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాలని... దీనికి సంబంధించి రూ.12,000 కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాలని చెప్పారు. 2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల లోపు పోలవరం నిర్మాణం పూర్తి చేయగలిగితే బావుంటుంది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన జలవనరుల ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలు అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. నల్లమల సాగర్ వంటి అంశాలు పార్లమెంటులో ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా ప్రస్తావనకు వస్తే ఏపీ వాదనలు గట్టిగా వినిపించాలని సూచించారు. తెలంగాణ కాళేశ్వరం నిర్మించి... మంజీరాకు నీళ్లను తరలించినా... ఏపీ అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఇదే సందర్భంలో నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో తెలంగాణ అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదనే అంశాన్ని వివరించాలని సీఎం ఎంపీలకు స్పష్టం చేశారు. ఇక అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని, రెండో దశ అమరావతి కూడా ప్రారంభం కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎక్కువ నిధులు రాబట్టడమే లక్ష్యం పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం చంద్రబాబు ఎంపీలకు వివరించారు.