దావోస్ పర్యటనలో కీలక నిర్ణయం

★ రష్మి గ్రూప్‌తో స్టీల్ ప్లాంట్ ఒప్పందం.

జనం న్యూస్: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే డక్టయిల్‌ ఐరన్‌(డీఐ) పైపుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్‌ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో స్టీల్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు రష్మి గ్రూప్, తెలంగాణ ప్రభుత్వం మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. వివరాలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశాల సందర్భంగా రష్మీ గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారీ, డైరెక్టర్ సంజీబ్ కుమార్ పట్వారీ అక్కడ పర్యటిస్తున్న తెలంగాణ ప్రతినిధి బృందాన్ని కలిసి, రాష్ట్రంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బుధవారం మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని బృందం రష్మి గ్రూప్‌తో కలిసి రూ.12,500 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే స్టీల్‌ ప్లాంట్‌.. లేబర్‌-ఇంటెన్సివ్‌ తయారీ విధానంతో పని చేస్తుందని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని రష్మి గ్రూప్‌ ప్రతినిధులు తెలిపారు. అలాగే రష్మీ గ్రూప్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో గ్రీన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, సర్క్యులర్‌ ఎకానమీ వంటి రంగాలకు సంబంధించి కూడా చర్చలు జరిపింది. నీటి సరఫరా, పారిశుద్ధ్య ప్రాజెక్టులలో ఉపయోగించే డక్టయిల్ ఐరన్ (DI) పైపులకు రష్మీ గ్రూప్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 1966లో స్థాపించబడిన ఈ గ్రూప్ తన ఉత్పత్తులను ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికాలోని 40 కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో ఇంధన-సమర్థవంతమైన ఉక్కు తయారీ, రాష్ట్ర స్థిరత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఇతర కార్యక్రమాలపై సహకరించడానికి ఆ కంపెనీ ఆసక్తిని వ్యక్తం చేసిందని పేర్కొంది. ఈ అవగాహన ఒప్పందంకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఇదిలాఉంటే, ప్రపంచంలో అతి పెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ‘ఏబీ ఇన్‌బెవ్‌’. తెలంగాణలో ఇప్పటికే ఉన్న తన తయారీ యూనిట్‌లను విస్తరించేందుకు భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. అలాగే, పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఇంకా కొన్ని సంస్థలు తమ యూనిట్లను విస్తరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి.