జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ…

★సారండా ఏజెన్సీలో కాల్పులు ★15 మంది నక్సల్స్ మృతి

సాక్షి డిజిటల్ న్యూస్ : భారతదేశాన్ని మావోయిస్ట్ రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి ఆపరేషన్ కగార్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగాంగా జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు జార్ఖండ్‌లోమరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. కిరీబురు పోలీస్ స్టేషన్‌ పరిధిలో సారండా అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు ప్రకటించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది అని... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు అని పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్‌ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టుల మృతి జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జిల్లాలోని కిరీబురు పోలీస్ స్టేషన్‌ పరిధిలో సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ కోబ్రా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో, బలగాలు ధీటుగా ప్రతిఘటించాయి. ఈ ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్ట్ రహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని పదేపదే వెల్లడిస్తున్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో అయినా కలిసిపోవాలని లేకపోతే ఏరివేతకు బలికాక తప్పదని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఏవోబీని జల్లెడపట్టారు. మావోయిస్టులకు అడ్డగాఉన్నా ఏవోబీలో నక్సల్స్ ఏరివేత ప్రక్రియ చేపడుతున్న సంగతి తెలిసిందే.అలాగే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సహా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు సైతం జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే పలు ఎన్‌కౌంటర్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి చెందారు. మృతుల్లో అగ్రనేత అనల్ ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ ఉన్నట్లు తెలుస్తోంది. అనల్‌ తలపై ఆరు రాష్ట్రాలలో మెుత్తంగా రూ.5 కోట్లకు పైగా రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు ఆర్గనైజేషన్‌లో అనల్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలపై దాడులకు సంబంధించి స్కెచ్ వేయడంలో అనల్ దిట్ట అని తెలుస్తోంది. లొంగిపోయిన మావోలకు తెలంగాణ పోలీసుల అండ అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో స్థిరపడే దిశగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అండగా నిలుస్తుంది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా అడుగులు వేస్తుంది.ఇప్పటికే లొంగిపోయి గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పునరావాస చర్యలను వేగవంతం చేసింది.లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస కార్యక్రమాలన్నింటినీ తెలంగాణ నిఘా విభాగానికి చెందిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)నేరుగా పర్యవేక్షిస్తోంది. తెలంగాణలో లొంగిపోయిన 576 మంది మావోయిస్టులు 1980లో పీపుల్స్‌వార్ (ప్రస్తుత సీపీఐ మావోయిస్ట్) ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది ఏకంగా 576 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరికి పునరావాస ప్యాకేజీలో భాగంగా స్వగ్రామాల్లో నివాస ధ్రువపత్రాలు ఇప్పించి, ఆధార్ నమోదు చేయిస్తున్నారు. అనంతరం పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు తెరిపించి, రివార్డు సొమ్మును అదే ఖాతాల్లో జమ చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి అవకాశం ఉన్న వారికి ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన పలువురికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందించారు.