కేటీఆర్‌కు సూటి సవాల్

★ఖమ్మం నుంచే పోటీ చేస్తా: ఎంపీ రేణుకా

జనం న్యూస్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన సొంత గడ్డ అయిన ఖమ్మం పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి తీరుతానని రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి స్పష్టం చేశారు. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నుంచి తాను పోటీ చేస్తానని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి స్పష్టం చేశారు. తన గెలుపును ఆపే దమ్ము కేటీఆర్‌కు ఉందా అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఈ సందర్భగా ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై రేణుకా చౌదరి స్పందించారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. పేదల హక్కులను కాలరాసే అధికారం ప్రధాని నరేంద్రమోడీకి లేదు అని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. 2024లో టికెట్ కోసం ప్రయత్నించిన రేణుకా చౌదరి ఇదిలా ఉంటే గత లోక్‌సభ ఎన్నిల్లో ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేయాలని రేణుకా చౌదరి గట్టిగా ప్రయత్నించారు. ఖమ్మం పార్లమెంట్ నుంచి రేణుకా చౌదరితోపాటు పలువురు ముఖ్య నేతలు దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగేందర్‌, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఖమ్మం పార్లమెంట్‌ స్థానానికి టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఖమ్మం నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలు ఖమ్మం పార్లమెంట్‌ నుంచి పోటీ చేయకపోతే తన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కోరిన సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు గెలుపొందిన రేణుకా చౌదరి 1999,2004 పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందారు రేణుకా చౌదరి. అనంతరం జరిగిన 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి పై విజయం సాధించారు. నామా నాగేశ్వరావుకు 469368 ఓట్లు రాగా రేణుకా చౌదరికి 344920 ఓట్లు లభించిన సంగతి తెలిసిందే.