సాక్షి డిజిటల్ న్యూస్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దేశంలో నీతి, నిజాయితీ రాజకీయాలు చేసిన వ్యక్తి… జాతి కోసం పనిచేసిన వ్యక్తి… ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం అని అన్నారు. ఇది తెలుగువారి చిరకాల ఆకాంక్షఅని చెప్పారు. ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు తప్పకుండా సాధిస్తామనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఇందుకోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్లు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడని అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగపురుషుడు అని పేర్కొన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారని తెలిపారు. దేశంలో సుపరిపాలనకు ఎన్టీఆర్ అర్థం చెప్పారని అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారుని చెప్పారు. విద్యావంతులు, బడుగులకు టికెట్లు ఇచ్చి ఎన్నో అవకాశాలు కల్పించారని… విద్యావంతులను, మేధావులను, సమర్థులను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం చేశారని… తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్లారని చెప్పారు.పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగించారని తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రం కోసం పోరాడి సాధించారని…. మదరాసిలు అని తెలుగు వాళ్లను పిలుస్తున్న రోజుల్లో తెలుగు జాతికి ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారని అన్నారు. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. బడుగులకు కొత్త చట్టాల తీసుకొచ్చారని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చారు.