సాక్షి డిజిటల్ న్యూస్ : ‘కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలి.గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను బెదిరించింది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘కూటమి ప్రభుత్వం వేధించదు… అండగా ఉంటుంది.పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు గేమ్ ఛేంజర్. దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో కీలక మైలురాయి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు మారినా పరిపాలనా పరమైన విధానాలు మాత్రం స్థిరంగా ఉండాలి. గత పాలకులు- రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను బెదిరించి, కోర్టుకు ఈడ్చి నానా ఇబ్బందులుపెట్టారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగులో పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతుంది. వారికి అండగా నిలుస్తుంది.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ‘సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మా ప్రభుత్వం నుంచి పెట్టుబడిదారులకు ఎలాంటి వేధింపులు ఉండవు’అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.కాకినాడలోని వాకలపూడిలో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఏఎం గ్రీన్ సంస్థ వారి గ్రీన్ అమ్మోనియా-గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్లాంట్ నమూనాని పరిశీలించి. యంత్ర పరికరాల పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలిపే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం.పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక మైలురాయి’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం ‘బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని గ్రీన్ కో వ్యవస్థాపకులు చలమలశెట్టి అనిల్ నిరూపించారు. అనేక కష్టనష్టాలను తట్టుకుని ఈ రోజున ఏఎం గ్రీన్ కంపెనీ స్థాపించారు.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.‘కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 15, 600 కోట్లు పెట్టుబడితో ప్రారంభం అవుతున్న ఈ సంస్థలో 8 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదక ఇంధన పెట్టుబడులు రానున్నాయి. 2027 ఏడాది చివరికి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా, పునరుత్పాదక ఇంధన ఆధారిత శుద్ధ ఇంధన కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది. నిర్మాణ దశలో సుమారు 8,000 మందికి, ఆపరేషన్ దశలో సుమారు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలి’ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. క్లీన్ ఎనర్జీ పాలసీతో విధానపరమైన స్పష్టత ఇచ్చాం ‘ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఆ ప్రయత్నాల్లో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక అడుగు. పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఆ రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకు ఏఎం గ్రీన్ ఎనర్జీ ముందుకు రావడం ఆనందందాయకం. ఆ దిశగా కూటమి ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.‘ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్య కేంద్రంగా, పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి హబ్గా తీర్చిదిద్దబోతోంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. అదే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.‘క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోనే మొట్టమొదటి మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో చారిత్రక మైలురాయిగా అభివర్ణించవచ్చు.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గ్రీన్ అమ్మోనియా రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో బలమైన అడుగు ‘ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన సాయంతో నీటిని ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో వాతావరణంలోని కర్బన ఉద్గారాలను పూర్తిగా క్లీన్ చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక అడుగు.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.‘ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరా చేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ ఇంధన సంస్థ Uniper తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారత దేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న తొలి శుద్ధ ఇంధన ఎగుమతి ఒప్పందం. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉండడ మనందరికీ గర్వకారణం.