మేడారం భక్తులకు శుభవార్త-ఇంటికే అమ్మవారి బంగారం ప్రసాదం!

పయనించే సూర్యుడు న్యూస్ : మేడారం వెళ్లలేని భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది.అమ్మవార్ల బంగారం ప్రసాదం భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తగు ప్రణాళికలు సిద్దం చేసింది. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయడం జరుగుతుంది. ఇందకుగానూ బంగారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు కేవలం రూ.299/- చెల్లించాల్సి ఉంటుంది అని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం‘సమ్మక్క సారలమ్మ జాతర’. ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది.ఈ జాతరకు సంబంధించి అధికారయంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.250కోట్ల వరకు నిధులు సైతం విడుదల చేసింది. అంతేకాదు మేడారం జాతరకు సంబంధించి విపరీతంగా ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మేడారం జాతరకు ఈ ఏడాది మూడు కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇలాంటి సమయంలో మేడారం వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. అమ్మవార్లకు బంగారం సమర్పించాలనకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవల్ని ఏర్పాటు చేసింది. మేడారం ప్రసాదం భక్తుల ఇంటికే అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసింది. రూ.299కే ఇంటికే ప్రసాదం ములుగు (వరంగల్) జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ దేవతలను పూజించడానికి తండోపతండాలుగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకుని బంగారం సమర్పించుకోవడం ఆనవాయితీ.అయితే వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తులకు బంగారం ప్రసాదం తమ ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తగు ప్రణాళికలు సిద్దం చేసింది. దేవాదాయ శాఖ సహకారంతో, మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయడం జరుగుతుంది. ఇందకుగానూ, బంగారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు కేవలం రూ.299/- చెల్లించాల్సి ఉంటుంది.భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు.మరింత సమాచారం కోసం, టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ను 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చు అని టీజీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. రహదారుల సెంట్రల్ లైటింగ్ డివైడర్ మధ్యలో సుందరీకరణ చెట్లు నాటాలి మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఇందుకోసం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం పడిగపూర్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు, స్తూపం రోడ్లను వాహనంలో పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులను పరిశీలించి, వన దేవతలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం లోని ల్యాండ్ స్కేపింగ్ పనులను, ప్రధాన ద్వారం ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. అలాగే స్వయంగా ఫ్లోరింగ్ కింది భాగంలో ఇసుక ఎంత మేరకు నింపుతున్నారో స్వయంగా చూశారు. పీటీ భీమ్స్‌పై అమర్చుతున్న బ్రాకెట్‌లను, మీడియా టవర్స్ నిర్మాణాలను, క్యూ లైన్స్ షేడ్స్‌ను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కల్చరల్ ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేడారంకు విచ్చేసిన భక్తులను మంత్రులు అప్యాయంగా పలకరించారు. అనంతరం హరిత హోటల్ లో మంత్రులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని, రహదారులపై ఉన్న మట్టి, ఇతర వ్యర్ధాలు వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారుల సెంట్రల్ లైటింగ్ డివైడర్ మధ్యలో సుందరీకరణ చెట్లను నాటాలని, అవసరం ఉన్న చోట కూలీల సంఖ్య పెంచుకొని పనులు జరిగేలా చూడాలని అన్నారు. గుత్తేదారులు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం పనుల విషయంలో అధికారులు, గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారిని ఐనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర పరిసరాలను జోనల్, యూనిట్ విధంగా విభజించి జోనల్‌కు ఒక ప్రత్యేక అధికారిని నియమించి బాధ్యతలను అప్పజెప్పాలని చెప్పారు. ఆలయ ప్రాంగణ పరిసరాలలో మిగిలిన వ్యర్ధాలను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. డివైడర్‌ పనులు పూర్తయ్యాక వెంటనే ఫైర్‌ ఇంజిన్లతో అన్ని రహదారులపై క్లీనింగ్‌ నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. అలాగే ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం జాతర రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.