సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం

జనం న్యూస్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు స్వగ్రామం అయిన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు మెుదలయ్యాయి.ఈ సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం, నందమూరి బాలకృష్ణ కుటుంబం, ఎంపీ శ్రీభరత్ కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, కోలాటం,చిన్నారుల ఆటపాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పలు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు బహుమతులు ప్రదానం చేశారు. మరోవైపువివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను అందుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారా వారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంది. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆయన సతీమణి నారా బ్రహ్మణి, తనయుడు నారా దేవాన్ష్‌లు సైతం పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. చిన్నారులతో ఆడిన చంద్రబాబు మనవడు అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను చంద్రబాబు నాయుడు కుటుంబం వీక్షించింది. చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నింటినీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపింది.ఈ క్రీడలలో చంద్రబాబు నాయుడు,అగ్రహీరో బాలకృష్ణల మనవళ్లు కూడా పాల్గొన్నారు. క్రీడాపోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి.వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు బహుమతులు అందజేశారు. ముగ్గులను పరిశీలించిన సీఎం చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా సీఎం చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. దాదాపు రెండు గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో సీఎం చంద్రబాబు నాయుడు గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమతులు అందజేశారు. సార్లంకపల్లెలో అగ్నిప్రమాదంపై చంద్రబాబు ఆరా కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో అగ్నిప్రమాదంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఊరిలో ఉన్న మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోం మంత్రి అనిత, ఇతర అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25వేలు సాయం అందించాలని ఆదేశం అగ్నిప్రమాద బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు నేడు అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. బాధితులకు అందే సహాయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *