పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం

*విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెడతాం *సీఎం చంద్రబాబు నాయుడు

సాక్షి డిజిటల్ న్యూస్: దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం..దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సవాళ్లను అధిగమిస్తూ 2026 అత్యుత్తమ ఏడాదిగా నిలిచేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు హితోపదేశం చేశారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం. 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రజల ఆశల్ని నిలబెట్టాం. వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించాం. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగాం.’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ‘ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిస్తున్నాను. తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు వేశాం. స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు. దీని కోసం ఇప్పటి వరకూ రూ.1114 కోట్లు వ్యయం చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశాం. దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికి పంపిణీ చేయగలిగాం. దీనికి రూ.2684 కోట్లు వ్యయం చేశాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 3వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి ‘ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్తమైలు రాయిని సాధించాం. 70 వరకూ పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశాం. అమరావతిని స్మశానం అని, ఎడారని ఎగతాళి చేశారు. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం. పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు. ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి?.’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 16 లక్షల మందికి ఉద్యోగాలు ‘పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చు. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం. భోగాపురం ఎయిర్ పోర్టు కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తాం.’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర సహకారంతో రూ.12 వేల కోట్ల సాయంతో దానిని కాపాడుకున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ ఆ ప్లాంట్‌ను నిలబెట్టి తీరుతాం. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయి. పెట్టుబడులకు డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. సీఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలు అన్నీ సాకారం అయితే 16 ల క్షల మందికి ఉద్యోగాలు వస్తాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాయలసీమలోనూ పెద్ద ఎత్తున నీటిని నిలిపాం ‘ఎస్ఐపీబీ ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా ఇచ్చాం. వీటి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ కూడా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది.’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘రాష్ట్రానికి పెట్టుబడులు రావటంలో కృషి చేసిన అధికారులు, ప్రభుత్వ విభాగాలను అభినందిస్తున్నాను. అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేస్తాం. ఆరు నెలల్లో క్వాంటం కంప్యూటర్ ఇక్కడి నుంచి పనిచేస్తుంది.విద్యుత్ కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించగలిగాం. భవిష్యత్తులో రూ.1.19 పైసల మేర యూనిట్ కొనుగోలు ధర తగ్గించటం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లలోనూ 970 టీఎంసీలను నింపగలిగాం. రాయలసీమలోనూ పెద్ద ఎత్తున నీటిని నిలిపాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *