
సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి మరో అరుదైన గౌరవం లభించింది. ఇందుకు సంబంధిం చిన వివరాలు ఇలా ఉన్నాయి...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి మరో అరుదైన గౌరవం లభించింది. డెయిరీ రంగంలో విశేష కృషి చేసినందుకు, పాడి రైతుల సాధికారత కోసం పని చేసినందుకు నారా భువనేశ్వరికి అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు - 2025ను ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రదానం చేసింది. సమాజంలోని పలు వర్గాలకు వివిధ సేవలు అందిస్తున్నందుకు యూకేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ గత ఏడాది డిస్టింగ్విష్ట్ ఫెలో షిప్-2025 అవార్డుతో భువనేశ్వరిని సత్కరించిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె నేతృత్వంలో నడిచే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. అయితే తాజాగా దేశంలోనే పేరు గాంచిన ఇండియన్ డెయిరీ అసోసియేషన్కు చెందిన సౌత్ జోన్ విభాగం... అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు - 2025 అవార్డును ప్రకటించింది. డెయిరీ పరిశ్రమ అభివృద్ధిలో భువనేశ్వరి నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన విశేష కృషి, డెయిరీ ఎకోసిస్టం కల్పించడాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు అందజేసి నట్టుగా తెలుస్తోంది. కేరళలోని కోజికోడ్లో కాలికట్ ట్రేడ్ సెంటర్, డాక్టర్ వర్గీస్ కురియన్ నగర్లో నిర్వహించిన సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్ క్లేవ్ - 2026 ప్రారంభ సమావేశంలో ఈ అవార్డును భునేశ్వరికి ప్రదానం చేశారు. నారా భువనేశ్వరి తరపున హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సీఈఓ కేశవన్ ఈ అవార్డును స్వీకరించారు. మా సంకల్పానికి మరింత ప్రోత్సాహం: నారా భువనేశ్వరి. సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్ క్లేవ్ 'అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025ను అందుకోవడం ఎంతో భావిస్తున్నానని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఇది హెరిటేజ్ ఫుడ్స్ బృందం చేసిన నిరంతర కృషికి, రైతులు, ఇతర భాగస్వాము లతో ఉన్న బలమైన సంబంధాలకు లభించిన అన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, స్థిరమైన గుర్తింపు విధానాలను అమలు చేస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలనే మా సంకల్పానికి ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఈ గౌరవం హెరిటేజ్ ఫుడ్స్ బ్రాండ్ ప్రతిష్ఠను మరింత పెంచడమే కాకుండా, ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంపొందిస్తూ, డెయిరీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో హెరిటేజ్ ఫుడ్స్ అగ్రగామిగా కొనసాగుతున్నదనేందుకు నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు.