రైతుల ఆదాయానికి డైరీ రంగం కీలకం

★వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్: డైరీ రంగాన్ని లాభదాయకంగా మార్చడంలో ఇండియన్ డైరీ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుంది అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.డైరీ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని కొనియాడారు. మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధులకు డైరీ రంగం ప్రధాన ఆధారం అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డైరీ రంగం వెన్నెముకగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ప్రాంతంలో సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్–2026 కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రమ ఉత్పత్తులను పరిశీలించి సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులకు నిత్య ఆదాయం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించడంలో డైరీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు పశుపోషణ ఆర్థిక భద్రతనిచ్చే మార్గంగా మారిందని...పాల ఉత్పత్తి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. ప్రాచీన కాలం నుంచే పశుపోషణ మరియు డైరీ రంగం భారతీయ నాగరికత యొక్క ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. డైరీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం డైరీ రంగం జాతీయ ఆర్థిక వ్యవస్థకే కాకుండా గ్రామీణ జీవనోపాధులకు, మహిళా సాధికారతకు మరియు పోషకాహార భద్రతకు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.అందువల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు శాస్త్రీయ అభివృద్ధులను అన్వయిస్తూ డైరీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం మన అందరి సమిష్టి బాధ్యత అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. డైరీ రంగాన్ని మరింత లాభదాయకంగా, సార్ధకంగా మార్చేందుకు శాస్త్రీయ మరియు సాంకేతిక పురోగతిని సమన్వయం చేస్తూ రంగాన్ని శక్తివంతం చేస్తున్న ఇండియన్ డైరీ అసోసియేషన్ చేసిన కృషిని మంత్రి హృదయ పూర్వకంగా అభినందించారు. సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్–2026 గొప్ప విజయాన్ని సాధించి, దేశ డైరీ రంగం పురోగతికి గణనీయమైన తోడ్పాటు అందిస్తుందని ఆకాంక్షించారు. ఫెలిసిటేషన్‌కు సరైన వ్యక్తిని ఎంపిక చేసినందుకు కూడా ఇండియన్ డైరీ అసోసియేషన్‌ను అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.