సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఆగ్రహం

★ అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు

సాక్షి డిజిటల్ న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం రోజున అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతిని కలిశారు. ఈ సందర్బంగా వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం రోజున అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతిని కలిశారు. ఈ సందర్బంగా వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై అధికార ఉల్లంఘన, సభ ధిక్కారానికి సంబంధించి హక్కుల తీర్మానాన్ని సమర్పించారు. శాసనసభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు చేపట్టాలని కోరారు. అసెంబ్లీ సెక్రటరీని కలిసిన వారిలో బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, విజయుడు, అనిల్ జాదవ్ ఉన్నారు. శాసనసభలో శనివారం రోజున కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిలిపివేతపై తప్పుడు ప్రకటనలు చేశారని, సాగునీటి విషయాలపై జరిగిన రెండు అపెక్స్ కౌన్సిల్ సమావేశాల మినిట్స్‌ను వక్రీకరించారని.. అలాగే తెలంగాణ, ఏపీ మధ్య తాత్కాలిక కృష్ణా జలాల పంపిణీ ఒప్పందాన్ని ఒక కట్టుబడి ఉండే ఒప్పందంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై ఈ తీర్మానం సమర్పించారు. శనివారం సభలో సాగునీటిపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి అన్ని విషయాలలోనూ ప్రాథమికంగా అధికార ఉల్లంఘనకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపించారు. హక్కుల తీర్మానాన్ని ప్రారంభించాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కోరింది. స్పీకర్ సభా కార్యకలాపాలతో బిజీగా ఉన్నందున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ లేఖను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.