
జనం న్యూస్: నికొలస్ మదురో పుట్టపర్తి సత్యసాయిబాబాకు గొప్ప భక్తుడనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. సత్యసాయి బాబా బతికి ఉన్న కాలంలో పుట్టపర్తికి వచ్చి మరి ఆశీస్సులు తీసుకున్నారు. దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై అమెరికా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే నికొలస్ మదురో పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమయంలో నికొలస్ మదురో భారతదేశం ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి సత్యసాయిబాబాకు గొప్ప భక్తుడనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. సత్యసాయి బాబా బతికి ఉన్న కాలంలో పుట్టపర్తికి వచ్చి మరి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే పుట్టపర్తి సాయిబాబాపై నికొలస్ మదురో భక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం నికోలస్ మదురో పుట్టపర్తి సత్యసాయి బాబాకు గొప్ప భక్తుడి ఉన్నారు. కారకాస్లోని తన కార్యాలయంలో సత్యసాయి బాబా చిత్రపటాన్ని కూడా ఉంటుంది. అలాగే నికోలస్ మదురో 2005లో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి కూడా వచ్చారు. నికొలస్, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్లతో కలిసి పుట్టపర్తి వచ్చి... సత్యసాయి బాబా ఆశీస్సులు పొందారు. అయితే ఆ సమయానికి మదురో, ఫ్లోర్స్ వివాహం చేసుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి వివాహం జరిగింది. వారు ఇండియాకు వచ్చిన సమయంలో సిలియా ఫ్లోర్స్ నెజువెలా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తరపున న్యాయవాదిగా ఉండగా మదురో అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. ఇక, వెనిజులా రాజధాని కారకాస్లో సత్యసాయి కేంద్రం కూడా ఉంది. దీనిని 1974లో ప్రారంభించారు. 2011 ఏప్రిలోలో సత్యసాయిబాబా మరణించినప్పుడు హ్యుగో చావెజ్ ప్రభుత్వంలో అప్పటి విదేశాంగ మంత్రి అయిన మదురో, వెనిజులా జాతీయ అసెంబ్లీ అధికారిక సంతాప తీర్మానాన్ని ఆమోదించేలా చేశారు.