సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

జనం న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ తీవ్రస్థాయలో ధ్వమెత్తారు.‘ఒక్కటే ప్రెస్‌మీట్‌లో ఒకసారి అసెంబ్లీకి రావాలి అంటాడు వెంటనే ఉరి తీయాలి అంటాడు. అసెంబ్లీకి వస్తే గౌరవం ఇస్తానని అంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అగౌరవంగానే ప్రవర్తించాడని అర్ధం కదా!’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలకు ప్రజలు ఈసారి ఆయనను కసబ్‌లాగా ఉరి తీస్తారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బైపోలార్ డిజార్డర్‌ సమస్యతో బాధపడుతున్నాడు అని చెప్పుకొచ్చారు. బైపోలార్ డిజార్డర్ అంటే మెంటల్ డిజార్డర్ అని అభివర్ణించారు. ఉదయం ఒక మాట సాయంత్రం మరో మాట మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నిన్న మెున్నటి వరకు అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం రేవంత్ రెడ్డిని పదేపదే పిలిచారని. అసెంబ్లీకి రండి సలహాలు ఇవ్వండి అని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తీరా మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరు చూస్తుంటే జుగుప్సాకరంగా ఉంది అని ఎమ్మెల్యే డా.సంజయ్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిని కసబ్‌లాగ ఉరి తీయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి తగ్గట్లుగా హుందాగా ప్రవర్తించడం లేదు అని కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ ధ్వజమెత్తారు.ఒక పద్ధతిగా ప్రవర్తించడం లేదని. చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు అని మండిపడ్డారు.నిన్నమెున్నటి వరకు బాగా ప్రవర్తిస్తానని చెప్పుకొచ్చేవాడని అసెంబ్లీలో మర్యాదగా గౌరవిస్తాం అని చెప్పేవాడని అంటే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు హుందాగా లేరు అని అర్థం అవుతుంది అని చెప్పుకొచ్చారు. ఒక్కటే ప్రెస్‌మీట్‌లో ఒకసారి అసెంబ్లీకి రావాలి అంటాడు. వెంటనే ఉరి తీయాలి అంటాడు అని డా. సంజయ్ ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వస్తే గౌరవం ఇస్తానని అంటున్నాడు... అంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అగౌరవంగానే ప్రవర్తించాడని అర్ధం కదా! అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలకు ప్రజలు ఈసారి ఆయనను కసబ్ లాగా ఉరి తీస్తారు అని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హెచ్చరించారు. బనకచర్ల ఏ జిల్లాలో ఉందో తెలీదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఎవరికీ తెలియదు అని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ చెప్పుకొచ్చారు. నీళ్ళ కుంటలు, చెరువులు, ప్రాజెక్టుల గురించి కనీస అవగాన సీఎం రేవంత్ రెడ్డికి లేదు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదుల ఏ బేసిన్‌లొ ఉందో అనేదానిపై కూడా కనీస అవగాహన కూడా లేకపోయింది అని చెప్పుకొచ్చారు.అంతేకాదు బనకచర్ల ఏ జిల్లాలో ఉంది అని సీఎం అడగడం చూస్తుంటే ఆయనకు కనీస అవగాహన ఉండటం లేదు అని సంజయ్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని కసబ్‌లా ఉరి తీస్తారు. జూరాల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలను ఉరి తీయాలి... మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే వాళ్లని రాళ్లతో కొట్టి చంపుతారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా.సంజయ్ మండిపడ్డారు. ఉరి తీయాలని జడ్జిమెంట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు.ఉరి తీయడానికి జడ్జిలు, న్యాయమూర్తులు,ఒక వ్యవస్థ ఉంది అని ఎమ్మెల్యే డా.సంజయ్ చెప్పుకొచ్చారు. తాము మాత్రం ఎవరినీ ఉరితీయాలని చెప్పం అని అది తమ సంస్కారం కాదు అని ఎమ్మెల్యే సంజయ్ చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు మాత్రం ఖచ్చితంగా తీర్పు ఇస్తారని వారి ఘోసతో వచ్చే ఎన్నికల్లో గట్టి తీర్పు ఇస్తారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలకు ప్రజలు ఈసారి ఆయనన కసబ్‌ మాదిరిగా ఉరి తీయడం ఖాయం అని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ హెచ్చరించారు.