పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నూతన సంవత్సరం వేళ గిరిజన మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో వారికి తాను ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నూతన సంవత్సరం వేళ గిరిజన మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో వారికి తాను ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, రక్తహీనత తదితర రుగ్మతలకు కారణమవుతున్న సికిల్ సెల్ ఎనేమియా నుంచి రక్షణ కల్పించేందుకు అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవనం ఏర్పాటు చేయనున్నారు. పవన్ కల్యాణ్ చొరవత దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మాణం చేపట్టనున్నారు. తద్వారా గిరిజన మహిళలకు పవన్ కల్యాణ్ న్యూ ఇయర్ కానుకను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి అడవితల్లి బాట కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో పవన్ కల్యాణ్ కురిడీ గ్రామంలో నిర్వహించిన మాటా మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు ఓ మహిళ సికిల్ సెల్ ఎనేమియా కారణంగా గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. జన్యుపరంగా వచ్చే ఈ రుగ్మత గర్భిణుల ఉసురు తీస్తోందని వివరించారు. అయితే వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్ గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఆ సమస్యను పరిష్కానని మాట ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కోసం పవన్ కల్యాణ్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సికిల్ సెల్ ఎనేమియా నివారణ ఎలా? అనే అంశంపై వైద్య నిపుణులతో పలు సందర్భాల్లో చర్చించారు. వారసత్వంగా వచ్చే ఈ వ్యాధి తీవ్రత రక్తమార్పిడి ద్వారా తగ్గించే అవకాశం ఉందని వైద్యులు పవన్ కల్యాణ్కు సూచించారని ఈ క్రమంలోనే నూతన సంవత్సర కానుకగా బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవనం ఏర్పాటు చేయను్నారు. గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా నిర్మించనున్న ఈ బ్లడ్ బ్యాంకు భవనంలో అవసరాలకి అనుగుణంగా రక్తం నిల్వ చేసుకునేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 మంది సికిల్ సెల్ ఎనేమియా బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఉపశమనాన్ని ఇవ్వనుంది.