
పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రోజున సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రోజున సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపించిన కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు సహా మండలాలు, గ్రామల సరిహద్దులు మార్పులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు చర్చలు జరిపింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది. ఇక, సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా మూడు కొత్త జిల్లాలు మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరంల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని. కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాలో విలీనం చేస్తారు. అంటే కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ ఒక జిల్లాను తొలగించడంతో రాష్ట్రంలో జిల్లాల మొత్తం సంఖ్య 28కి పెరగనుంది. ఇందుకు సంబంధించిన తుది గెజిట్ నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ముఖ్యమైన మార్పులు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాలో విలీనం చేస్తారు. >> అన్నమయ్య జిల్లాలో భాగమమైన రాజంపేటను కడప జిల్లాలో విలీనం చేస్తారు. అన్నమయ్య జిల్లాలో భాగమైన రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో కలపున్నారు. గూడూరును తిరుపతి జిల్లా నుంచి తిరిగి నెల్లూరు జిల్లాలో కలపనున్నారు. ఇదిలాఉంటే, రాష్ట్రంలో ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకు కూడా కేబినెట్ ఆమోదం లభించింది. ఈ సమావేశంలో రాయచోటి మార్పు అంశంపై ప్రత్యేకంగా సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలోనే రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రామప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని వాదించినప్పటికీ... ఆ జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రాజంపేట వాసులు కడపను కోరుకుంటున్నారని, రైల్వేకోడూరు వాసులు తిరుపతి కోరుకుంటున్నారని చెప్పారు. కే అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ జిల్లాను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని అందుకే రాయచోటి మార్పు తప్పట్లేదన్నారు. ఈ నిర్ణయం ప్రజల ప్రాధాన్యత ఆధారంగా తీసుకున్నట్టుగా వివరించారు. ఆదోనిలో మూడు కొత్త మండలాల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ జరగగా కేవలం రెండింటికి మాత్రమే కేబినెట్ ఆమోదం లభించింది. నెల్లూరులోని పరిపాలనా సమస్యలపై కేబినెట్లో చర్చ జరిగింది. అక్కడ రెవెన్యూ డివిజన్, డీఎస్పీ అధికార పరిధులు వేర్వేరు ప్రదేశాలలో ఉన్నాయనే అంశాన్ని మంత్రి నారాయణ కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పాలన సౌలభ్యం కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పారు. పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం మినహా 17 జిల్లాల్లో మార్పులు చోటుచేసుకున్నట్టుగా తెలిపారు.