అయోధ్యలో బాలరాముడి దర్శనం చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం (డిసెంబర్ 28) రోజున ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని బాలరాముడిని దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం (డిసెంబర్ 28) రోజున ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని బాలరాముడిని దర్శనం చేసుకున్నారు. వివరాలు... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం హైదరాబబాద్ నుంచి అయోధ్య చేరుకున్నారు. అయోధ్య చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడకు ఉత్తరప్రదేశ్ అధికారులు, రామాలయం నిర్వాహకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు అయోధ్య రామాలయం పరిసరాలకు చేరుకున్నారు. అక్కడ బాలరాముడి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామాలయం నిర్మించిన తీరును ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు తెలియజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి నేరుగా విజయవాడ బయలుదేరారు. అయితే అయోధ్య రామమందిరం పర్యటనకు సంబంధించి సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు. ‘‘ఈ రోజు అయోధ్యలోని దివ్యమైన, అద్భుతమైన శ్రీ రామ జన్మభూమి మందిరంలో దర్శనం చేసుకొని... ప్రార్థనలు చేసే భాగ్యం నాకు లభించింది. మరోసారి ఇక్కడ ఉండటం ఒక ప్రశాంతమైన, ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే అనుభవం. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తిని ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, చంద్రబాబు నాయుడు గతేడాది అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్బంగా అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఈరోజు చంద్రబాబు అయోధ్యకు వెళ్లి బాలరాముడి దర్శనం చేసుకున్నారు.